మహేష్ బాబును చూస్తూ నటించాలంటే చాలా కష్టం: సముద్రఖని

మహేష్ బాబు తాజాగా నటించిన సర్కార్ వారి పాట సినిమాలో విలన్ పాత్ర ద్వారా ప్రేక్షకులను మెప్పించారు నటుడు సముద్రఖని. ఈయన ఇదివరకే అలా వైకుంఠపురం, క్రాక్ సినిమాలలో నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు.ఇలా ఈ సినిమాలతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సముద్రఖని మహేష్ బాబు సినిమాలో ఎంపీ రాజేంద్రనాథ్ పాత్రలో సందడి చేశారు. ఇక ఈ సినిమాలో ఈయన ఈ పాత్ర ద్వారా ఎంతో మంచి ఆదరణ సంపాదించుకున్నారు. తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూ లో పాల్గొని ఈ సినిమా గురించి మహేష్ బాబు గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఈ సందర్భంగా సముద్రఖని మాట్లాడుతూ మహేష్ బాబు వంటి స్టార్ హీరో నోటివెంట తన పేరు రావడం తనకు చాలా సంతోషంగా ఉంది అని ఆయన తెలిపారు.మహేష్ బాబుకు ఎంతోమంది స్టార్ట్ నటీనటులు తెలిసినప్పటికీ ఆయన ఈ పాత్రకు పర్టిక్యులర్ గా నన్ను తీసుకోవాలని సూచించడం నిజంగా నా అదృష్టం. మహేష్ బాబు చెప్పడంతో డైరెక్టర్ గారు తనకు వచ్చి కథ చెప్పారని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా సినిమాకి ఓకే చెప్పానని సముద్రఖని వెల్లడించారు.

ఇక మహేష్ బాబు నటించిన మురారి, మహర్షి, భరత్ అనే నేను సినిమాలు ఎన్ని సార్లు చూసానో తనకే తెలియదని సముద్రఖని ఈ సందర్భంగా వెల్లడించారు.మహేష్ బాబు సినిమాలు ఎంతో మంచి మెసేజ్ ఉన్న సినిమాఅని ఇలాంటి సినిమాలు సమాజానికి అవసరమని ఆయన తెలిపారు.ఇకపోతే మహేష్ బాబు సినిమాల కోసం థియేటర్ కు వెళ్ళినప్పుడు మిగతా నటీనటుల గురించి తాను ఎప్పుడు చూడని కేవలం మహేష్ బాబును చూస్తూ అలా ఉండిపోతానని తెలియజేశారు. ఇక సినిమా సెట్లో ఆయనని చూస్తూ నటించాలంటే చాలా కష్టమని ఈ సందర్భంగా సముద్రఖని మహేష్ బాబు సినిమాల గురించి తెలిపారు.