సర్కారు వారి పాట’ ఫస్ట్ సాంగ్ పై ఇంట్రెస్టింగ్ అప్డేట్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం “సర్కారు వారి పాట”. మహేష్ బాబు కెరీర్ లోనే అత్యంత స్టైలిష్ గా ప్లాన్ చేస్తున్న ఈ సినిమాని దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ సినిమా నుంచి ఆల్రెడీ కొన్ని అప్డేట్స్ వచ్చి భారీ రెస్పాన్స్ ని కూడా అందుకున్నాయి. ఇక ఈ సినిమా నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఈ చిత్రం నుంచి వస్తున్నట్టు తెలుస్తుంది.

థమన్ ఇచ్చిన ఫస్ట్ సాంగ్ రిలీజ్ కి సన్నాహాలు జరుగుతున్నాయట. అందుతున్న సమాచారం ప్రకారం నవంబర్ మొదటి వారంలో అలా రిలీజ్ కానుందట. దీనిపై అనౌన్సమెంట్ కూడా ఈ వారంలో రాబోతున్నట్టు తెలుస్తుంది. దీని కోసం అయితే మహేష్ అభిమానులు ఎప్పుడు నుంచో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబో హిట్ ఆల్బమ్స్ మూడు ఉన్నాయి అందుకే ఇది మరింత స్పెషల్ గా మారింది.