Chiru Acharya : ఇన్సైడ్ టాక్ : మెగా ఫ్యాన్స్ కి “ఆచార్య” నుంచి బిగ్ అప్డేట్ వస్తుందట.!

Chiru Acharya : టాలీవుడ్ నుంచి వస్తున్న లేటెస్ట్ బిగ్గెస్ట్ మాసివ్ మల్టీ స్టారర్ చిత్రాల్లో మెగాస్టార్ చిరంజీవి మరియు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ లు హీరోలుగా బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించిన భారీ బడ్జెట్ ఏక్షన్ డ్రామా చిత్రం “ఆచార్య” కూడా ఒకటి.
మెగా ఫ్యాన్స్ అయితే ఎప్పుడెప్పుడా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా రిలీస్ అయ్యే ఏప్రిల్ నెల రానే వచ్చేసింది. మరి ఇదిలా ఉండగా ఈ సినిమాపై లేటెస్ట్ సమాచారం ఒక ఇండస్ట్రీ వర్గాల నుంచి వినిపిస్తుంది. చిత్ర బృందం ఈ సినిమా నుంచి ఒక బిగ్ అప్డేట్ ని అందించడానికి డేట్ మరియు ముహూర్తం ని ఫిక్స్ చేసినట్టుగా ఇన్సైడ్ టాక్.
రేపు ఉగాది పండుగని తప్పించి ఏప్రిల్ 10న వస్తున్నటువంటి శ్రీరామ నవమి సందర్భంగా ఒక క్రేజీ అప్డేట్ ని ఆడియెన్స్ ముందుకు వారు తీసుకు రాబోతున్నారట. మరి ఆ అప్డేట్ ఏమిటో అనేది చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుందని సినీ వర్గాల మాట.
అదేంటో వేచి చూడాల్సిందే మరి. ఇక ఈ సినిమాలో చిరు సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా రామ్ చరణ్ సరసన పూజా హెగ్డే ఒక క్యామియో రోల్ లో నటించింది. అలాగే మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రం ఏప్రిల్ 29న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుండగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మాణం అందించారు.