Ukraine: రష్యా దాడుల్లో భారతీయ విద్యార్థి మృతి..?

Ukraine: ముందునుంచి అనుకున్న విధంగా అందరూ భయపడినట్టు గానే జరిగింది. రష్యా, ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధానికి భారతీయ విద్యార్థి బలయ్యాడు.ఖార్కివ్ లో క్షిపని షెల్స్ మీదపడటంతో కర్ణాటకకు చెందిన భారతీయ విద్యార్థి నవీన్ చనిపోయాడు. కర్ణాటకలోని హవేరి జిల్లా చెళగేరి గ్రామానికి చెందిన నవీన్ అనె యువకుడు ఉక్రెయిన్ మెడిసిన్ చేస్తున్నాడు. నవీన్ మెడికల్ నాలుగో సంవత్సరం చదువుతున్నాడు. ఇంటికి తిరిగి బయలుదేరి నేపథ్యంలో యుద్ధం లో చిక్కుకుని ప్రాణాలను కోల్పోవడం అందర్నీ కలచివేస్తోంది.

21 ఏళ్ల నవీన్ యూనివర్సిటీలో మెడిసన్ చదువుతున్నాడు. ఇప్పటికే 1500 మంది దాక భారతీయులు ఉత్తర సరిహద్దు చేరుకొని అక్కడ మన విదేశాంగ శాఖ అధికారుల సహాయంతో విమానం ఎక్కేసి సొంత దేశానికి వచ్చేశారు. నవీన్ కూడా ఇంటికి చేరే ప్రయత్నం చేస్తున్న క్రమంలోనే రష్యా బలగాలు మూకుమ్మడిగా దాడికి దిగడంతో నవీన్ ప్రాణాలు కోల్పోయాడు.