Raja Ravindra: బాలయ్య సినిమా షూటింగ్‌కి లేటుగా వెళ్లాను…బాలయ్య ఏమి చేసారో తెలుసా?

Raja Ravindra: హీరో నందమూరి బాలకృష్ణతో కలిసి నిప్పు రవ్వ సినిమా చేశానని నటుడు రాజా రవీంద్ర అన్నారు. ఆయనతో కాంబినేషన్లో దాదాపు 110 రోజులు కలిసి షూటింగ్ చేశానని ఆయన చెప్పుకొచ్చారు. తామిద్దరూ కలిసి బాంబేలోనూ కలిసి షూటింగ్ చేశామని, అక్కడ షూట్ కోసం వెళ్లినపుడు బాలకృష్ణ, తాను పక్కపక్క రూముల్లోనే ఉండేవాళ్లమని ఆయన చెప్పారు. అప్పుడు చాలా క్లోజ్‌గా కూడా ఉండేవారని ఆయన తెలిపారు.

అయితే శ్రీమన్నారాయణ సినిమాకు ఫిల్మ్ సిటీలో షూటింగ్ చేస్తున్నపుడు బాలకృష్ణ సెట్‌కి 7గంటలకే వచ్చి కూర్చునేవారని రాజా రవీంద్ర అన్నారు. తాను ఆ సినిమాలో జైలర్ వేషం వేశానన్న ఆయన, అది ప్రొడక్షన్ కూడా తానే చేశానని ఆయన స్పష్టం చేశారు. ఒకరోజు బాలకృష్ణ వచ్చిన చాలా సేపటి తర్వాత తాను షూట్‌కి వచ్చానని, రాగానే నమస్తే చెప్తే, పరామర్శలు తర్వాత గానీ ముందు మేకప్ వేసుకో అని అన్నారని రాజా రవీంద్ర చెప్పారు. వేషమేంటని అడిగితే డైరెక్టర్ చెబుతారని, ప్రొడక్షన్ వాళ్లను అడిగితే బాబు 6.30గంటలకే వస్తే మీరు కూడా ముందే వస్తారని అనుకున్నారని, ఇప్పుడు అందరూ తన కోసం ఎదురు చూస్తున్నారని అన్నట్టు ఆయన తెలిపారు. ఆ విషయం మరి తనకు చెప్పాలి కదా అని ఆయన అన్నట్టు రాజా రవీంద్ర చెప్పారు.

ఆ రోజు బాలకృష్ణ దగ్గరికి వెళ్లడానికి టెన్షన్ పడ్డాను గానీ, సర్లే వాళ్లు మిస్టేక్ చేస్తే నువ్వేం చేస్తావ్ అని ఆయన అన్నట్లు రాజా రవీంద్ర నవ్వుతూ వివరించారు. ఆయన చాలా ప్రత్యేకంగా ఉంటారన్న రవీంద్ర, ఆయనకు నచ్చితే మాత్రం ఎవరేం చెప్పినా పట్టించుకోరని ఆయన తెలిపారు. అలాగే అవతలి వాళ్లలో ఏమైనా ఇష్టం లేని లక్షణాలుంటే మాత్రం నిర్మోహమాటంగా చెప్పేస్తారని ఆయన చెప్పారు. నువ్వు కనిపించకు… నిన్ను చూస్తే ఇరిటేషన్ వస్తుంది అని అంటారని ఆయన తెలిపారు.