ఆ హీరోతో డేటింగ్ చేయాలని ఉంది.. మనసులో మాట బయటపెట్టిన ప్రపంచ సుందరి!

2017 సంవత్సరంలో మిస్ వరల్డ్ గా గెలుపొందిన మానుషీ చిల్లర్ గురించి తెలియని వారుండరు. ప్రస్తుతం ఈమె బాలీవుడ్ లో కథానాయికగా మంచి గుర్తింపు పొందింది. అక్షయ్ కుమార్ హీరోగా నటిస్తున్న “పృథ్వీ రాజ్” సినిమాలో అక్షయ్ కుమార్ కి జోడిగా నటిస్తోంది. ఈ సినిమాకు చంద్రప్రకాష్ దివేది దర్శకత్వం వహించారు. ఈ సినిమా షూటింగ్ పనులు పూర్తీ చేసుకొని విడుదలకి సిద్దంగా ఉంది.ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ సినిమా జూన్ 3 వ తేదీన థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి.

సినిమా ప్రమోషన్స్ కోసం నటి మానుషీ చిల్లర్ కూడా పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటోంది. ఈ క్రమంలోనే మానుషీ చిల్లర్ ఇటీవల ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె తన మనసులో మాటను బయటపెట్టింది. టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ అంటే తనకు క్రష్ అని, రామ్ చరణ్ కి పెళ్లి కాకపోతే నేనే వెళ్లి తనతో డైటింగ్ చేయమని రామ్ చరణ్ ని అడిగేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది. తన మాటల ద్వారా రామ్ చరణ్ అంటే నాకు ఎంత ఇష్టమో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

తూఫాన్ సినిమా ద్వార బాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైన రామ్ చరణ్ సినిమాతో అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయారు. కానీ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషలలో విడుదలైన సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ కలిసి నటించారు. ఈ సినిమాలో అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్ నటనకు బాలీవుడ్ ప్రేక్షకులు ఆయన అభిమానులుగా మారారు. ఏకంగా ప్రపంచ సుందరి తమా అభిమాన హీరో గురించి ఇలా మాట్లాడటంతో రామ్ చరణ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.