నిర్మాత‌ల‌కు క‌న్న‌డ బ్యూటీ షాకిస్తోంది!?

Rashmika

ఇప్పుడు ర‌ష్మిక తెలుగులో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. ‘స‌క్సెస్’ వచ్చిందంటే ఇక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవ‌స‌ర‌మే ఉండ‌దు. ఫుల్ సక్సెస్ లో ఉన్న క‌న్న‌డ బ్యూటీ రష్మికా మందన్నా పెద్ద మొత్తంలో రెమ్యూన‌రేష‌న్ డిమాండ్ చేస్తూ నిర్మాత‌ల‌కు షాకిస్తోందిట.

Rashmika
Rashmika

క‌న్న‌డ చిత్ర పరిశ్ర‌మ‌లో ల‌క్ష‌ల్లోనే పారితోషికం అందుకున్న ఈమె టాలీవుడ్‌కు మ‌కాం మార్చాక రేటు పెంచేసిందని ఇండస్ట్రీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తెలుగులో తొలి చిత్రం ‘ఛ‌లో’తో ప్రేక్ష‌కుల‌ దృష్టిని ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఆ త‌ర్వాత న‌టించిన ‘గీతా గోవిందం’ కూడా బంప‌ర్ హిట్ సాధించింది. దీంతో భారీ చిత్ర  నిర్మాత‌ల నుంచి ఆఫ‌ర్లు ఆమె కోసం క్యూ కట్టాయి. అలా స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించే అవ‌కాశాన్ని పట్టేసింది.

‘గీతాగోవిందం’ స‌క్సెస్ వ‌ర‌కు ఆమె సినిమాకు రూ.50 ల‌క్ష‌లలోపే తీసుకుంది.. కానీ సంక్రాంతి బ‌రిలోకి దిగిన‌ మ‌హేశ్‌బాబు సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రం ‘స‌రిలేరు నీకెవ్వ‌రు’ విజ‌యానందంలో  ర‌ష్మిక త‌న‌ రెమ్యూన‌రేష‌న్‌ను రెండు కోట్ల రూపాయ‌ల‌కు పెంచింద‌ట‌. తెలుగులో కొన్నేళ్లుగా సినిమాలు చేస్తున్న కొంద‌రు హీరోలు కూడా ఇంత పారితోషికం అందుకోక‌పోవ‌డం గ‌మనార్హం.

కాగా ర‌ష్మిక ప్ర‌స్తుతం అల్లు అర్జున్ ‘పుష్ప’, శ‌ర్వానంద్ ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ చిత్రంలో న‌టిస్తోంది. కెరీర్‌లోనూ, లైఫ్‌లోనూ ఎంతో ఎత్తుకి ఎదగాలన్నది ఆమె ఆశ. ఇది సాధిస్తే చాలు అనుకోదట. అన్నీ సాధించాలనుకుంటానని చెబుతోంది.