గుణశేఖర్ అంటే ఒక టాప్ టెక్నీషియన్. ఈ విషయాన్నీ కాదనేవాళ్ళు ఎవరు లేరు. కానీ గుణశేఖర్ కెరీర్ మొత్తం చూసుకుంటే సినిమా, సినిమాకు చాలా గ్యాప్ తీసుకుంటాడు, అలాగే మంచి కంటెంట్ సినిమాలు తీసినా కానీ సక్సెస్ గురన్తీ లేదు.
‘చూడాలని ఉంది’, ‘ఒక్కడు’ తప్ప గుణశేఖర్ కెరీర్ లో సూపర్ హిట్స్ లేవు. ‘ఒక్కడు’ తర్వాత ఇప్పటివరకు ఒక్క హిట్ కూడా ఇవ్వని గుణశేఖర్ ఎంతో భారీగా ‘రుద్రమదేవి’ సినిమా తీసాడు. ఎప్పుడూ చెప్పుకోలేదు కానీ, ‘బాహుబలి’కి ధీటుగా ఈ సినిమాని తీద్దామనుకొన్నాడు, అందుకు రానా, అనుష్క, అల్లు అర్జున్ లాంటి భారీ కాస్టింగ్ చేసాడు. కానీ ఆ మూవీ ప్లాప్ అయ్యింది. ఆ త్రీడీ ఎఫెక్టులు పెద్దగా కనిపించలేదు. త్రీడీ కోసం సినిమా ఆలస్యమైంది. ఖర్చు పెరిగింది. అయినా పెద్దగా ఒరిగిందేం లేదు.
మళ్ళీ ఇప్పుడు గుణశేఖర్ అదే తప్పు చేస్తున్నాడు. సమంత తో `శాకుంతలమ్`ని త్రీడీలో చూపించాలన్న నిర్ణయం తీసుకొన్నాడు. దీని వల్ల బడ్జెట్ పెరిగిపోతుంది, అలాగే టైం కూడా చాలా వేస్ట్ అవుతుంది. అందుకు తగిన ప్రతిఫలం ఉంటుందా అంటే గ్యారెంటీ లేదు. ఇప్పటికే ఈ సినిమా పై చాలా నమ్మకం పెట్టుకున్న గుణశేఖర్ చాలా ఖర్చుపెట్టాడు. ఈ సినిమా అయినా గుణశేఖర్ కి హిట్ ఇస్తుందో లేదో చూడాలి.