వారిపై పరువు నష్టం దావా వేస్తా.. స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన గృహలక్ష్మి కస్తూరి!

ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ ద్వారా బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమయ్యారు సీనియర్ నటి కస్తూరి శంకర్. అయితే ఈమె కెరియర్ పరంగా బిజీగా ఉండటమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా నయనతార సరోగసి ద్వారా ఇద్దరు మగ బిడ్డలకు జన్మనిచ్చారనే విషయం సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేయడంతో పరోక్షంగా ఈ విషయంపై గృహ లక్ష్మీ నటి స్పందిస్తూ చేసిన ట్వీట్ తీవ్ర దుమారం రేపుతుంది.

ఈ క్రమంలోనే ఈమె సరోగసి విధానం పై స్పందిస్తూ ఈ సరోగసి విధానం ఇండియాలో 2022 జనవరి నుంచి బ్యాన్ చేశారు. కేవలం కొన్ని వైద్యపరమైన అనివార్య కారణాల మినహా సరోగసి విధానాన్ని వాడకూడదు. రాబోయే రోజుల్లో దీని గురించి మరింతగా వింటారు అంటూ పోస్ట్ చేశారు.నయనతార సరోగసి విధానంలో కవల పిల్లలకు జన్మనిచ్చారనే విషయం తెలిసిన వెంటనే ఈమె సరోగసి బ్యాన్ చేశారంటూ ట్వీట్ చేయడంతో పరోక్షంగా నయనతార దంపతులను ఉద్దేశించి చేశారంటూ పలువురు భావిస్తున్నారు.

ఈ క్రమంలోనే కొన్ని మీడియా ఛానల్స్ నయనతార విగ్నేష్ దంపతులను ఉద్దేశించి కస్తూరి ఈ విధమైనటువంటి ట్వీట్ చేశారని వార్తలు సృష్టించారు. ఈ వార్తలపై స్పందించిన కస్తూరి తాను ఎవరిని ఉద్దేశించి ఎలాంటి వార్తలు రాయలేదని, ఇలా అనవసరమైన కథలు అల్లిన వారిపై తాను పరువు నష్టం దావా వేస్తానని వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటానని కొన్ని తమిళ న్యూస్ ఛానల్ అలాగే తెలుగు న్యూస్ ఛానల్ ట్యాగ్ చేస్తూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.