అరుదైన గౌరవం దక్కించుకున్న బాలకృష్ణ..?

నటసింహం నందమూరి బాలకృష్ణ ఎన్నో ఏళ్లుగా వందల సంఖ్యలో సినిమాలు చేసి యాక్షన్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరచుకున్నారు. హిట్, ప్లాఫ్ లతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ నేటి హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు. ఇటీవల విడుదలైన అఖండ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ గా నిలిచిన కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ప్రస్తుతం బాలకృష్ణ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు . ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానుల్లో భారీ అంచనాలను పెంచాయి. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ త్రిల్లర్గా పెరికెక్కుతున్న ఈ సినిమాకి ఎన్.బి.కె 107 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమాని రూపొందిస్తున్నారు.

ఇదిలా ఉండగా నందమూరి అభిమానులు ఆనందపడే విషయం ఇటీవల బయటికి వచ్చింది. నందమూరి బాలకృష్ణ ఇటీవల ఒక అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న సంగతి అధికారికంగా ప్రకటించారు. బాలకృష్ణ సినారే జీవన సాఫల్య జాతీయ స్వర్ణకంకణ పురస్కారం అందజేయబోతున్నట్లు ప్రకటించారు. మహా కవి సి. నారాయణ రెడ్డి 91వ జయంతి సందర్భంగా రవీంద్రభారతిలో నిర్వహించే పురస్కార వేడుకలలో జూలై 30వ తేదీన బాలకృష్ణకు ఈ పురస్కారం అందజేయబోతున్నారు. ఈ పురస్కార వేడుకకు మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు హాజరు కానున్నట్లు సమాచారం.

తమ అభిమాన హీరో నటసింహం నందమూరి బాలకృష్ణకు ఈ అరుదైన పురస్కారం లభించడంతో నందమూరి అభిమానులు సంబరాలు చేసుకుంటు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రస్తుతం ప్రస్తుతం బాలకృష్ణ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం కర్నూల్ లో కొండారెడ్డి బురుజు వద్ద కొన్ని సీన్లు షూటింగ్ జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా నటుడిగా మంచి గుర్తింపు ఏర్పరచుకున్న బాలకృష్ణ హోస్ట్ గా కూడా తన టాలెంట్ నిరూపించుకున్నాడు. ఓటీటీలో ప్రసారమైన అన్ స్టాపబుల్ విత్ ఎన్.బి.కె అనే రియాలిటీ షో కి పోస్ట్ గా వ్యవహరించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నాడు. ఈ రియాలిటీ షో సీజన్ 2 తొందరలోనే ప్రారంభం కానుంది . ఈ సీజన్ 2 కి కూడా బాలకృష్ణ హోస్ట్ గా వ్యవహరించనున్నాడు.