గోబ్యాక్‌ బాలకృష్ణ.. జై జగన్..బాలకృష్ణకు చేదు అనుభవం

balakrishna telugu rajyam

 సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ తన నియోజకవర్గంలో మున్సిపల్ ఎన్నికల ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే సోమవారం చివరి రోజు ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం ఎదురైంది. సోమవారం మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి చివరి తేదీ కావడంతో.. బాలకృష్ణ మరింత జోరుగా ప్రచారాన్ని సాగించారు. అయితే బాలకృష్ణ 21వ వార్డు మోత్కుపల్లిలో ప్రచారం నిర్వహిస్తుండగా.. కొందరు స్థానికులు గోబ్యాక్‌ బాలకృష్ణ అంటూ నినాదాలు చేశారు.

Nandamuri Balakrishna: బాలకృష్ణకు చేదు అనుభవం.. గోబ్యాక్ బాలకృష్ణ అంటూ నినాదాలు..

బాలకృష్ణతో పాటు స్థానిక నాయకులు ఇదివరకే ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహించారని కొందరు స్థానికులు తెలిపారు. తిరిగి సోమవారం సాయంత్రం అక్కడికి చేరుకోవడంతో కొందరు స్థానికులతో పాటు వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. ఇక, ఆ ప్రాంతంలో సాయంత్రం 4 గంటల సమయానికి ఎమ్మెల్సీ మహమ్మద్‌ ఇక్బాల్, వైసీపీ అభ్యర్థి మారుతీరెడ్డిల ప్రచారానికి పోలీసులు అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చిన బాలకృష్ణను పలువురు వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. వైసీపీకి కేటాయించిన సమయంలో ప్రచారానికి ఎలా వస్తారని అని అడిగారు.

గోబ్యాక్‌ బాలకృష్ణ.. జై జగన్‌.. అని నినాదాలు చేశారు. ఈ క్రమంలోనే టీడీపీ, వైసీపీ శ్రేణుల మధ్య స్వల్ప ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని ఇరువర్గాలకు సర్ధిచెప్పారు. తన ప్రచారానికి అనుమతి లేదని పోలీసులు చెప్పడంతో బాలకృష్ణ అక్కడి నుంచి వెళ్లిపోయినట్టుగా సమాచారం. ఇక, హిందూపురం మున్సిపల్ ఎన్నికల్లో బాలకృష్ణ అన్నీ తానై ప్రచారం నిర్వహించారు. ఒక్క వార్డు కూడా ఏకగ్రీవం కాకుండా చూసుకున్నారు. అధికార పార్టీపై తీవ్ర విమర్శలు చేస్తూ ప్రచారం కొనసాగించారు. అయితే ప్రచారం సందర్భంగా బాలకృష్ణ ఓ అభిమానిపై చేయి చేసుకోవడం వైరల్‌గా మారింది. ఇదిలా ఉంటే.. వైసీపీ హిందూపురంను జిల్లాగా ఏర్పాటు చేస్తే తాను కూడా పట్టణానికి క్యాన్సర్ ఆస్పత్రి తీసుకొస్తానని బాలయ్య ప్రకటించారు.