కరోనా తగ్గముఖం పడుతుందని అందరూ కాస్త ఊపీరి తీసుకుంటున్న వేళ కొత్త వేరియంట్ ‘ఒమిక్రాన్ ఎక్స్ఈ’ భారత్లోకి ప్రవేశించింది. ముంబయిలో తొలి కేసును అధికారులు గుర్తించారు. ఒమిక్రాన్ బీఏ.1, బీఏ.2 రకాల కలయికతో ‘ఒమిక్రాన్ ఎక్స్ఈ’ ఏర్పడినట్లు పరిశోధకులు చెబుతున్నారు. బీఏ.2 రకంతో పోల్చితే ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్ 9.8శాతం అధికంగా వ్యాప్తి చెందే అవకాశముందని అంచనా వేశారు.