భారత్​లోకి కరోనా​ కొత్త వేరియంట్

కరోనా తగ్గముఖం పడుతుందని అందరూ కాస్త ఊపీరి తీసుకుంటున్న వేళ కొత్త వేరియంట్​ ‘ఒమిక్రాన్​ ఎక్స్​ఈ’ భారత్​లోకి ప్రవేశించింది. ముంబయిలో తొలి కేసును అధికారులు గుర్తించారు. ఒమిక్రాన్ బీఏ.1, బీఏ.2 రకాల కలయికతో ‘ఒమిక్రాన్​ ఎక్స్​ఈ’ ఏర్పడినట్లు పరిశోధకులు చెబుతున్నారు. బీఏ.2 రకంతో పోల్చితే ఒమిక్రాన్​ ఎక్స్​ఈ వేరియంట్​ 9.8శాతం అధికంగా వ్యాప్తి చెందే అవకాశముందని అంచనా వేశారు.