Draupathi 2: మోహన్.జి దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ద్రౌపతి 2. నేతాజీ ప్రొడక్షన్స్ సమర్పణలో చోళ చక్రవర్తి, జి.ఎం.ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ లో రూపొందుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గతంలో ఇదే డైరెక్టర్ ద్రౌపతి అనే సినిమా తీసి వివాదాల్లో నిలిచాడు. ఆ సినిమాకు ఇది ప్రీక్వెల్ అని తెలుస్తోంది.
కాగా ఈ సినిమా 14వ శతాబ్దానికి చెందిన కథాంశంతో తెరకెక్కుతోంది. మొఘల్ చక్రవర్తులు తమిళనాడు లోకి ప్రవేశించిన సమయంలో కథ, చారిత్రక ఘటనల ఆధారంగా, దక్షిణ భారతదేశానికి చెందిన హోయసాల చక్రవర్తి మూడవ వీర వల్లలార్, సేంధమంగలాన్ని పాలించిన కడవరాయుల రాజులు కథల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కబోతోందట.
కాగా ఇందులో రిచర్డ్ రిషి, రక్షణ ఇందుసుదన్ ప్రధాన పాత్రలో నటిస్తుండగా నట్టి నటరాజ్, వై.జి.మహేంద్రన్, మన తెలుగు భామలు దివి, దేవయాని శర్మతో పాటు అనేక మంది తమిళ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే 75 శాతం షూటింగ్ పూర్తయింది. మరి ఈ చారిత్రక సినిమా 2020లో వచ్చిన ద్రౌపతి కథకు ఎలా లింక్ చేస్తారో చూడాలి మరి. కాగా ఇప్పటికే ఈ మూవీపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

