ఇండస్ట్రీలో దిల్ రాజు మాస్టర్ ప్లాన్..తన సినిమాతో ట్రెండ్ స్టార్ట్ చేసాడు..!

Dil Raju

Dil Raju  : మన తెలుగు సినిమా దగ్గర మంచి మాస్టర్ మైండ్ నిర్మాతలు ఎవరన్నా ఉన్నారు అంటే వారిలో అధిక సక్సెస్ రేట్ తో ఎప్పటికప్పుడు కొత్త ప్రాజెక్ట్ లతో ఇండస్ట్రీలో కొత్త ప్రయోగాలతో వచ్చే నిర్మాతలు తక్కువమంది ఉంటారు. ఆ కొద్ది మందిలో కూడా దిల్ రాజు ఒకడని చెప్పాలి. అయితే ఈ నిర్మాత ఇప్పుడు మంచి స్వింగ్ లో ఉన్నాడు.

ఒకదాన్ని మించి ఒక సినిమా చేస్తూ వస్తున్న దిల్ రాజు రీసెంట్ గా టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిన సమస్యపై ఇప్పుడు దృష్టి పెట్టి ఇతర నిర్మాతల కన్నా ముందు అలర్ట్ అయ్యి తన నెక్స్ట్ సినిమా రిలీజ్ కి గాను సమస్యగా ఉన్న టికెట్ ధరల పై మాట్లాడుతూ తన లేటెస్ట్ సినిమా “ఎఫ్ 3” కి మాత్రం ఎలాంటి టికెట్ ధరల హైక్ లు ఉండవని..

ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ఏవైతే సాధారణ ధరలు ఉన్నాయో వాటితోనే రిలీజ్ చేస్తున్నామని తెలిపారు. అయితే ఈ ట్రెండ్ ని మాత్రం తానే స్టార్ట్ చేసారని చెప్పాలి. గత కొన్నాళ్ల కితం నుంచి మావి పెద్ద సినిమాలు అంటూ ఉన్న ధరల కన్నా ఎక్కువ రేట్లు తో ఆడియెన్స్ ని హీరోలు నిర్మాతలు పిండుకున్నారు.

కానీ వల్ల సినిమాలకి నష్టం థియేటర్స్ కి జనాలు రావట్లేదు అనే మాట గట్టిగా వినిపించడంతో దిల్ రాజు దాన్ని సీరియస్ తీస్కొని అలెర్ట్ అయ్యాడు. దానికి ఫలితంగా ముందే తాను జాగ్రత్త తీసుకోవడం జరిగింది. మొత్తానికి అయితే దిల్ రాజు ఈ ట్రెండ్ ని స్టార్ట్ చేసి ఇతర పెద్ద సినిమాలకి దిశా నిర్దేశం చేసినట్టే అని చెప్పాలి.