బిగ్ న్యూస్ : టాలీవుడ్ లో ఫేక్ వసూళ్ళు.. దిల్ రాజు హాట్ కామెంట్లు.!

రికార్డులు కోసం అనో, అభిమానులు కోసం అని తాము తమ స్టేజ్ తగ్గించుకోకూడదు అని మన టాలీవుడ్ లో కొందరు హీరోలు నిజానికి వారి సినిమా ఎలా పెర్ఫామ్ చేసినా భారీ లెవెల్లో వసూళ్లు వస్తున్నట్టుగా పోస్టర్ లతో ఊదరగొడతారు. అయితే అందరూ హీరోలు కూడా అలా వుండరు కానీ రీసెంట్ గా అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప అలాగే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట చిత్రాలకు ఈ వసూళ్ళ పోస్టర్స్ దర్శనం ఇచ్చాయి.

వీరితో పాటుగా భారీ ప్లాప్ లు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చిత్రం “రాధే శ్యామ్” కి కొన్ని రోజులు అలాగే మెగాస్టార్ చిరంజీవి నటించిన “ఆచార్య” లు కూడా థియేటర్స్ లో కొన్ని రోజులకి గాను వసూళ్ళ పోస్టర్స్ ని వేశారు. అయితే వీటిలో ఎన్ని సినిమాలు నిజంగా అంత అందుకున్నాయి లేదు అనే వాటికి రిలేటెడ్ గా లేటెస్ట్ ప్రముఖ నిర్మాత మరియు డిస్ట్రిబ్యూటర్ అయినటువంటి దిల్ రాజు పలు హాట్ కామెంట్స్ చెయ్యడం వైరల్ గా మారింది.

తాను నిర్మాణం వహించిన ఎఫ్ 3 సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మాట్లాడుతూ తాము డిస్ట్రిబ్యూటర్ లుగా పైన సినిమా నిర్మాతలకు మాకు వచ్చిన లెక్కలు మాత్రమే ఇస్తామని అవే వారు కూడా తమ పోస్టర్ లలో వేస్తారని ఏమీ లేదు. మేము ఇచ్చిన వసూళ్ళ వివరాలు కాకుండా వారికి నచ్చిన ఫిగర్స్ వారు వేసుకుంటారని వాటికి మాకు ఎలాంటి సంబంధం ఉండదని షాకింగ్ కామెంట్స్ చేసారు. దీనితో ఇప్పుడు అంతా సర్కారు వారి పాట వసూళ్లపైనే డౌట్ పడుతున్నారు.

ఓ పక్క సినిమాకి ఏమో రికార్డ్ వసూళ్లు అంటూ పోస్టర్ లు వేస్తున్నారు కానీ గ్రౌండ్ రియాలిటీ లో సినిమాకి ఎక్కడా పత్తా లేని ఆక్యుపెన్సీ కనిపిస్తుంది. దీనితో సర్కారు వారి పాట కి ఫేక్ వసూళ్లు వచ్చి ఉండొచ్చు అనే అభిప్రాయంలో కొందరు ఉన్నారు. మరి ఈ ఫేక్ వసూళ్ళలో అయితే అసలు నిజాలు డిస్ట్రిబ్యూటర్ లకు మాత్రమే తెలుస్తాయని చెప్పాలి. అయితే ఇక్కడ మరో టాక్ కూడా ఉంది. కావాలనే కొందరు నిర్మాతలు భారీ ఫిగర్స్ వేస్తారని అందుకు ఓవర్ బిల్డప్ ఆడియెన్స్ లోకి తీసుకెళ్లడం కోసమే అని అంటారు.