Dhanush: కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ గురించి మనందరికీ తెలిసిందే. ధనుష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నారు. ఇందులో భాగంగానే శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న కుబేర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున కూడా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదలైన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. పాన్ ఇండియా లెవెల్ లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీని అమిగోస్ క్రియేషన్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు మూవీ మేకర్స్.
ఈ సందర్భంగా మూవీ మేకర్స్ సినిమా ప్రమోషన్స్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. అందులో భాగంగానే తాజాగా జూన్ 1న చెన్నైలో కుబేర సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న, దేవి శ్రీ ప్రసాద్, అనిరుధ్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. అయితే ఈ వేడుకలో ధనుష్ చేసిన కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. తన రాబోయే సినిమాలపై వస్తోన్న నెగిటివ్ ప్రచారాన్ని గట్టిగానే ఖండిస్తూ దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చారు ధనుష్. ఈ సందర్భంగా హీరో ధనుష్ మాట్లాడుతూ.. కొందరు వ్యక్తులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం తన రాబోయే సినిమా గురించి నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు.
ఎవరు ఎన్ని చేసినా నన్ను ఏం చేయలేరు. నా అభిమానులు నాపై వచ్చిన నెగిటివ్ ప్రచారాన్ని హ్యాండిల్ చేయగలరు.. నా గురించి నెగిటివ్ ప్రచారాన్ని చేసేవారు దయచేసి పక్కకు వెళ్లి ఆడుకోండి.మాకు ఇలాంటి సర్కస్ వద్దు. ఇక్కడ నా అభిమానులు మాత్రమే కాదు.. నా సహచరులు కూడా ఉన్నారు. దాదాపు 23 ఏళ్లుగా నా అభిమానులు నాతోనే ఉన్నారు. నా గురించి నెగిటివ్ రూమర్స్ ప్రచారం చేసి నన్ను అడ్డుకుంటామని మీరు అనుకుంటే అంతకంటే ముర్ఖత్వం మరొకటి ఉండదు. గతంలో నేను చాలా ఇబ్బందులు పడి ఇప్పుడు ఈ స్థాయిలో ఉన్నాను. ప్రపంచానికి కుబేర వంటి సినిమా చాలా అవసరం. ఈ మూవీ హిట్ అవుతుందని పూర్తి నమ్మకం ఉంది నా సినిమా విడుదలకు నెల రోజులు ఉండగానే నెగిటివ్ ప్రచారం చేసినా ఏం చేయలేరంటూ కామెంట్స్ చేశారు ధనుష్. దీంతో ఇప్పుడు ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.