హైద‌రాబాద్‌ను వ‌ద‌ల‌నంటున్న క‌రోనా..!

తెలంగాణ‌లో క‌రోనా కేసులు పెద్ద ఎత్తున న‌మోద‌వుతున్న సంగ‌తి తెలిసిందే. సామాన్యుల‌తో పాటు ప్ర‌‌జాప్ర‌తినిధులు సైతం క‌రోనా లిస్ట్‌లో చేరిపోతున్నారు. ఇక తెలంగాణ‌లో కొత్త‌గా 1,593 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, 8 మంది క‌రోనా కార‌ణంగా ప్రాణాలు కోల్పోయారు. కొత్త‌గా న‌మోదైన కేసుల్లో జీహెచ్ఎంసీ ప‌రిధిలోనే 641 పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. కొత్త‌గా న‌మోదైన కేసులతో క‌లిపి తెలంగాణ వ్యాప్తంగా మొత్తం క‌రోనా కేసుల సంఖ్య‌ 54,059కు చేరుకుంది. ఇక తెలంగాణ‌లో క‌రోనాతో ఇప్ప‌టి వ‌ర‌కు 463 మంది మృతి చెంద‌గా, 41,332 మంది క‌రోనా నుండి కోలుకుని ఆస్ప‌త్రుల నుండి డిశ్చార్జ్ అయ్యారు. దీంతో ప్ర‌స్తుతం 12,554 మంది క‌రోనా రోగులు వివిధ ఆస్ప‌త్రుల్లో చికిత్స పొందుతున్నారు. హైద‌రాబాద్ న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌కు క‌రోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయ్యిందని స‌మాచ‌రం.