హనుమాన్ జయంతి ఊరేగింపులో కాల్పులు.. 12 మందికి గాయాలు

 హనుమాన్ జన్మోత్సవ్ ఊరేగింపులో ఉద్రికత్తత చోటుచేసుకుంది. ఢిల్లీలోని జహంగీర్‌పురి ప్రాంతంలోని కుశాల్ సినిమా సమీపంలో శనివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.  ఊరేగింపుపై రాళ్లు రువ్విన తర్వాత దుండగులు కాల్పులు కూడా ప్రారంభించారు. దీని తరువాత, రెండు వైపుల నుండి అక్కడికి చేరుకున్న ప్రజలు చాలా వాహనాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనలో పోలీసులు సహా ఇరువర్గాలకు చెందిన 12 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసులు 10 బృందాలను ఏర్పాటు చేశారు.