AP Government: చిరు వాహనాన్ని బయటే ఆపీ… నేడు విష్ణు వాహనం నేరుగా లోపలికి పంపిన సీఎం సెక్యూరిటీ..!

AP Government: ఏపీలో గత కొద్ది రోజుల నుంచి సినిమా టికెట్ల వ్యవహారం పై ఎన్నో చర్చలు జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే. టిక్కెట్ల రేట్లపై మరోసారి నిర్ణయం తీసుకోవాలని టాలీవుడ్ పెద్దలు ఎన్నో సార్లు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డికి విన్నపం చేసినా ఈ నిర్ణయంపై ఏపీ ప్రభుత్వం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలోనే ఫిబ్రవరి 10వ తేదీ టాలీవుడ్ పెద్దలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసిన సంగతి మనకు తెలిసిందే.అయితే ఈ సమావేశానికి మంచు కుటుంబం దూరంగా ఉండటం చేత ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ విధంగా టాలీవుడ్ సినీ పెద్దలు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డిని కలిసిన కొద్దిరోజులకే మంచు విష్ణు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ క్రమంలోని నేడు మంచు విష్ణు జగన్మోహన్ రెడ్డిని కలిశారు. అయితే ఈ సమావేశం పై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే మంచు విష్ణు తాడేపల్లిలోని సీఎంక్యాంపు కార్యాలయంలో ఆయనని కలవడానికి వెళ్లిన సీఎం సెక్యూరిటీ విష్ణు వాహనాన్ని నేరుగా లోపలికి పంపించారు. ఈ క్రమంలోనే పలువురు ఈ విషయం పై విమర్శలు చేస్తున్నారు.

మొన్న సీఎంను కలవడం కోసం వచ్చిన చిరంజీవి ప్రభాస్ మహేష్ బాబు రాజమౌళి వంటి వారిని సీఎం సెక్యూరిటీ గేటు బయట వాహనం ఆపి వారిని లోపలికి పంపించారు. ఈ క్రమంలోనే వీరందరూ గేటు బయట నుంచి నడుచుకుంటూ లోపలికి వెళ్లారు. కానీ నేడు విష్ణు వాహనాన్ని లోపలికి పంపించడంతో చాలామంది ఈ విషయం పై విమర్శలు చేస్తున్నారు. అయితే మంచు విష్ణు ఇలా ఉన్న ఫలంగా జగన్మోహన్ రెడ్డిని కలవడానికి గల కారణం ఏమిటి..ఈ సమావేశంలో భాగంగా సినిమా సమస్యలను వివరించడం కోసం విష్ణు ముఖ్యమంత్రిని కలిసారా లేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వీరికి బంధువు కావడంతో చుట్టపుచూపుగా ఆయనను కలిశారా అనే విషయం తెలియాల్సి ఉంది.