Ram Charan: రామ్ చరణ్ పాన్ ఇండియా హీరో కావడానికి కారణం మెగాస్టార్ చిరంజీవేనా… అసలు విషయం వెల్లడించిన మెగాస్టార్!

Ram Charan:మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా మంచి గుర్తింపు పొందారు.ఈ క్రమంలోనే ఈ సినిమా నుంచి తన తదుపరి సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా స్థాయిలో విడుదల చేయాలని భావిస్తున్నారు. ఇలా రామ్ చరణ్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా ఎంతో మంచి గుర్తింపు పొందారు. అయితే రామ్ చరణ్ ఇలా గుర్తింపు పొందడానికి గల కారణం మెగాస్టార్ చిరంజీవి అని చెప్పాలి.

మెగాస్టార్ నటించిన ఆచార్య సినిమా విడుదల తేది దగ్గర పడటంతో పెద్దఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న చిరంజీవి రామ్ చరణ్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. నిజానికి ఆచార్య సినిమాలో నటించాల్సి ఉంది తాను కాదని రామ్ చరణ్ అని చెప్పుకొచ్చారు. కథ మొత్తం విన్న తర్వాత రామ్ చరణ్ ఈ సినిమాకి కమిట్ అయ్యారు అయితే ఈ సినిమాకు ఓకే చెప్పిన తర్వాత రాజమౌళి త్రిబుల్ ఆర్ కోసం కబురు పంపించారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ ఏ సినిమాల్లో నటించాలని సందిగ్ధంలో ఉన్న నేపథ్యంలో కొరటాల శివని పిలిపించి తనతో మాట్లాడినట్లు వెల్లడించారు.

రాజమౌళి దర్శకత్వంలో ఫాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నటిస్తే రామ్ చరణ్ భవిష్యత్ బాగుంటుందని ఆలోచించిన చిరంజీవి కొరటాల శివతో మాట్లాడుతూ ఆచార్య సినిమాలో రామ్ చరణ్ కి బదులుగా తనని తీసుకోవాలని అడిగారట.ఇక మెగాస్టార్ అంతటివాడే ఇలా అడగటంతో కొరటాల శివ కాదనలేక చిరంజీవికి అనుగుణంగా కథలో మార్పులు చేసి ఆయన హీరోగా ఈ సినిమాని తెరకెక్కించారు.ఇక ఈ సినిమాలో రెండో హీరో పాత్ర కూడా ఉండడంతో ఆ పాత్రను రామ్ చరణ్ కి అనుగుణంగా మార్చి రామ్ చరణ్ కూడా ఈ సినిమాలో భాగస్వామ్యం చేశారు. ఇలా మెగాస్టార్ చిరంజీవి ప్రమేయంతోనే రాజమౌళి సినిమాలో రామ్ చరణ్ నటించారు.