మణిరత్నం సినిమాలో చిరంజీవి

మణిరత్నం అంటే ఇండియా లో అత్యుత్తమ దర్శకుల్లో ఒకరు. హిట్, ప్లాప్ తో సంబంధం లేకుండా ఆయన మార్క్ ఉంటుంది. ఇప్పుడు తరచూ ప్లాపులు ఇస్స్తున్నాడు కానీ కొన్నేళ్ల క్రితం మణిరత్నం అంటే ఒక మేజిక్. ఆయన సినిమాల్లో ఒక్కసారైనా నటించాలని చాలా పెద్ద పెద్ద స్టార్స్ కోరుకునేవారు. అయితే తెలుగు లో కేవలం నాగార్జున తో మాత్రమే మణిరత్నం ‘గీతాంజలి’ అనే సినిమా తీసాడు.

ఇప్పుడు ‘మెగాస్టార్’ చిరంజీవి కూడా మణిరత్నం సినిమాలో భాగం అయ్యాడని తెలుస్తుంది. మ‌ణిర‌త్నం ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన తాజా చిత్రం `పొన్నియ‌న్ సెల్వన్‌`. కార్తి, విక్ర‌మ్, జ‌యం ర‌వి, ఐశ్వ‌ర్యరాయ్‌.. ఇలా బ‌డా స్టార్ గ‌ణం ఉంది ఈ సినిమాలో. సెప్టెంబ‌రు 30న వ‌స్తోంది. ఈ సినిమాలో ప‌రోక్షంగా చిరు ప‌నిచేశారు. అదేమిట‌న్న‌ది ప్ర‌స్తుతానికైతే స‌స్పెన్స్‌. ఈ సినిమాకి సంబంధించిన ప్ర‌మోష‌న్ ఈవెంట్ ఈ రోజు హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మ‌ణిర‌త్నం మాట్లాడుతూ.. చిరంజీవికి థ్యాంక్స్ చెప్పుకొన్నారు. “చిరంజీవి గారికి థ్యాంక్స్‌. కానీ నేను ఆయ‌న‌కు థ్యాంక్స్ ఎందుకు చెబుతున్నానో ఇప్పుడే చెప్ప‌ను..” అని కాస్త స‌స్పెన్స్ లో పెట్టేశారు.

బహుశా ఈ సినిమాకి చిరంజీవి వాయిస్ ఓవర్ ఇచ్చి ఉండొచ్చని అనుకుంటున్నారు. అలాగే మణిరత్నం రాజమౌళి కి కూడా థాంక్స్ చెప్పాడు. రాజ‌మౌళి వ‌ల్లే.. ఇలాంటి సినిమాలు చేయ‌డానికి ధైర్యం వ‌చ్చింద‌న్నారు మ‌ణిర‌త్నం.

రాజమౌళి ‘బాహుబలి’ సీక్వెల్స్ తో సౌత్ సినిమా కి ప్రపంచ ఖ్యాతి వచ్చిందని తన సినిమా వల్లే తాను కూడా కూడా “పొన్నియిన్ సెల్వన్” చిత్రాన్ని రెండు భాగాలుగా చేసానని ఈ సినిమాలు కూడా పెద్ద హిట్టవుతాయని ఆశిస్తున్నానని తెలిపారు. దీనితో ఈ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ గా మారాయి.