Chiranjeevi: నా భార్య సురేఖ విషయంలో చరణ్ నాకు అన్యాయం చేశారు… ఆ క్షణాలు నా జీవితంలో మర్చిపోను: చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో చేసిన ఆచార్య సినిమా ఈనెల 29వ తేదీన విడుదల కానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా ప్రమోషనల్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్ లో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ ప్రెస్ మీట్ లో భాగంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు తమదైన శైలిలో సమాధానాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవిని ప్రశ్నిస్తూ ఆచార్య సినిమా షూటింగ్ సమయంలో రామ్ చరణ్ నుంచి ఏమైనా నేర్చుకున్నారా అని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు చిరంజీవి సమాధానం చెబుతూ… తనపై షాట్ అయిపోగానే చాలా అద్భుతంగా వచ్చింది అంటూ మాట్లాడతారు. కానీ చరణ్ అలా కాదు ఆ సీన్ మొత్తం డైరెక్టర్ చూసి ఓకే అన్న తర్వాత సంతోషం వ్యక్తం చేస్తారు. చరణ్ లో ఈ విషయం తనకు బాగా నచ్చిందని మెగాస్టార్ తెలిపారు.ఇకపోతే ఆచార్య సినిమా షూటింగ్ సమయంలో 20 రోజుల పాటు ఇద్దరు కలిసి ఒకే కాటేజ్ లో ఉన్నామని చిరంజీవి వెల్లడించారు. ఎంతో అందమైన ఆ ప్రదేశంలో రామ్ చరణ్ తో గడిపిన ప్రతిక్షణం తన జీవితంలో మర్చిపోలేనిదని ఆయన తెలియజేశారు.

ఇక అంత అందమైన ప్రదేశానికి తనతో పాటు తన భార్య సురేఖను కూడా తీసుకువెళ్దాం అంటే రామ్ చరణ్ అందుకు ఒప్పుకోలేదు. ఈ విధంగా రామ్ చరణ్ తన భార్య సురేఖను తన నుంచి దూరం చేసి తనకు అన్యాయం చేశాడని, ఈ సందర్భంగా రామ్ చరణ్ గురించి మెగాస్టార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మెగాస్టార్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.