మెగా ప్రభంజనం: చిరు – బాలయ్య కాంబో సెట్టయిపోయింది

అవునండీ మీరు విన్నది నిజమే. చిరంజీవి, బాలకృష్ణ కాంబో సెట్టయ్యింది. అయితే, ఈ కాంబినేషన్ బిగ్ స్క్రీన్ కోసం కానే కాదు. ఓటీటీ తెర కోసం. బాలయ్య హోస్ట్‌గా ‘ఆహా’ ఓటీటీ ఛానెల్‌లో ‘అన్‌స్టాపబుల్’ అనే ఓ టాక్ షో స్టార్ట్ అవుతున్న సంగతి తెలిసిందే. దసరా సందర్భంగా ఈ షో కి సంబంధించిన గ్లింప్స్ కూడా రలీజ్ చేశారు. దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

పాపులర్ సెలబ్రిటీస్‌ని ఈ టాక్ షోలో భాగం చేసేందుకు టీమ్ వర్క్ సిద్ధమవుతోందట. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ టాక్ షోలో కనిపించే అవకాశాలున్నట్లు జోరుగా వార్తలు వినిపించాయి. కానీ, అందులో నిజమెంతో అని, కొందరు నిట్టూర్చారు. అయితే, స్వయంగా బాలయ్యే ఆ విషయంలో తాజాగా స్సష్టత ఇచ్చేశారు.

ఈ టాక్ షోకి మెగాస్టార్ చిరంజీవి కూడా వస్తారు అని కన్ఫామ్ చేశారు బాలయ్య. దాంతో ఇటు మెగా అభిమానుల్లోనూ అటు బాలయ్య అభిమానుల్లోనూ అంతులేని ఆసక్తి నెలకొంది. నవంబర్ నుంచి స్టార్ట్ కానున్న ఈ టాక్ షోని మెగాస్టార్ ఎపిసోడ్‌తో గ్రాండ్‌గా స్టార్ట్ చేస్తారా.? అనే ఉత్కంఠ నెలకొంది.

జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా బుల్లితెరపై ప్రసారమవుతున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రోగ్రామ్‌కి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలి గెస్ట్‌గా విచ్చేసి బుల్లితెరకూ, ఆ షోకీ మరింత హైప్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అలాగే, ఇప్పుడు మెగాస్టార్ ఫస్ట్ ఎంట్రీతో బాలయ్య హోస్ట్‌గా ఓటీటీలో ప్రసారం కాబోయే తాజా టాక్ షోకీ సరికొత్త హైప్ క్రియేట్ చేస్తారేమో చూడాలి మరి.