మ‌రో రీమేక్‌పై క‌న్నేసిన చిరంజీవి.. తెలుగు నేటివిటీకి అనుగుణంగా చేస్తాడ‌ని టాక్

ఆరు ప‌దుల వయ‌స్సులోను ఉత్సాహంగా సినిమాలు చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి ప్రేక్ష‌కులకు ప‌సందైన వినోదాన్ని అందిస్తున్నారు. కరోనా వ‌ల‌న దాదాపు తొమ్మిది నెల‌లు ఇంటికే ప‌రిమిత‌మైన ఆయ‌న ఇప్పుడు కొర‌టాల శివ ద‌ర్శ‌కత్వంలో రూపొందుతున్న ఆచార్య సినిమాతో బిజీగా ఉన్నారు. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ రాజ‌మండ్రి ప‌రిస‌ర ప్రాంతాల‌లో జ‌రుగుతుంది. రీసెంట్‌గా ఈ చిత్ర షూటింగ్‌లో పాల్గొనేందుకు అక్క‌డికి వెళ్ళారు. ఆయ‌న‌కు అభిమానుల నుండి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. ఈ షెడ్యూల్‌లో చిరంజీవితో పాటు రామ్ చ‌ర‌ణ్ కూడా పాల్గొన్నారు. మే 13న చిత్రం విడుద‌ల కానుండ‌గా, ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Chiranjeevi Twitter Profile pic changed
 

ఆచార్య త‌ర్వాత చిరంజీవి రీమేక్‌ల బాట ప‌ట్టాడు. మ‌ల‌యాళంలో సూపర్ హిట్ అయిన లూసిఫ‌ర్ రీమేక్ ను త్వ‌ర‌లో మొదలు పెట్ట‌నున్నాడు. ఈ సినిమాను త‌మిళ ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా తెర‌కెక్కించ‌నున్నాడు. ఈ సినిమా త‌ర్వాత మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో వేదాళం రీమేక్ చేయ‌నున్నాడు. ఆ త‌ర్వాత బాబీ ద‌ర్శ‌క‌త్వంలోను సినిమా చేయ‌నున్నాడు. ఈ మూడు సినిమాల‌కు సంబంధించి ఇప్ప‌టికే అఫీషియ‌ల్ అనౌన్స్‌మెంట్ వ‌చ్చింది. తాజాగా చిరు మ‌రో రీమేక్ చేయ‌నున్న‌ట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.

అజిత్ హీరోగా నటించిన ‘ఎన్నై ఎరిందాల్’ సినిమాను రీమేక్ చేయాలనే ఆలోచనలో చిరు ఉన్న‌ట్టు తెలుస్తుంది. ఈ చిత్రం తెలుగులో ఎంత‌వాడు కాని పేరుతో విడుద‌లైన‌ప్ప‌టికీ, తెలుగు నేటివిటీకు అనుగుణంగా మూవీని రీమేక్ చేయాల‌ని అనుకుంటున్నాడ‌ట‌. ఈ సినిమా త‌ర్వాత త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, బోయ‌పాటి శీను ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, ప్ర‌శాంత్ వ‌ర్మ ద‌ర్శ‌కత్వంలో ఓ చిత్రం చేయ‌నున్న‌ట్టు స‌మాచారం. ప్ర‌శాంత్ వ‌ర్మ ఇప్పుడు నాగార్జున‌తో సినిమా చేస్తున్న విష‌యం తెలిసిందే.