ప్రారంభ‌మైన చిరంజీవి లూసీఫ‌ర్ రీమేక్ చిత్రం.. ఫిబ్ర‌వ‌రి నుండి షూటింగ్ మొద‌లు!

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. క‌రోనా వ‌ల‌న వాయిదా ప‌డ్డ ఈ చిత్రం శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటుంది. కాజ‌ల్ అగ‌ర్వాల్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది. మరి కొద్ది రోజుల‌లో చిత్ర షూటింగ్ పూర్తి చేసి స‌మ్మ‌ర్‌కు మూవీని థియేట‌ర్స్‌లోకి తీసుకురావాల‌ని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇటీవ‌ల రామ్ చ‌రణ్ చిత్ర బృందంతో జాయిన్ కాగా, సిద్ధ టీంతో క‌లిసాడ‌ని మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. వీలైనంత త్వ‌ర‌గా ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసి వెంట‌నే లూసీఫర్ రీమేక్ చిత్రాన్ని మొద‌లు పెట్టాల‌ని మెగాస్టార్ భావిస్తున్నారు.

కొద్ది సేప‌టి క్రితం చిరంజీవి 153వ చిత్రం లాంచ‌నంగా ప్రారంభ‌మైంది. పూజా కార్య‌క్ర‌మాలు పూర్తైన త‌ర్వాత చిరంజీవి, ద‌ర్శ‌కుడు మోహ‌న్ రాజా, సంగీత ద‌ర్శ‌కుడు థ‌మ‌న్, నిర్మాత‌లు అంద‌రు క‌లిసి ఫొటోలు దిగారు. ప్ర‌స్తుతం ఆ ఫోటోలు సోష‌ల్ మీడియాలో హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్, మెగా సూప‌ర్ గుడ్ ఫిలింస్, ఎన్వీఆర్ ఫిలింస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఫిబ్ర‌వ‌రిలో సెట్స్ పైకి తీసుకెళ‌తార‌ట‌. తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచికి అనుగుణంగా లూసిఫ‌ర చిత్రాన్ని మోహ‌న్ రాజా తెర‌కెక్కించ‌నున్న‌ట్టు టాక్.

ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా థమన్ కి అవకాశం దక్కడం ప‌ట్ల ఆయ‌న త‌న ఆనందాన్ని ట్విట్ట‌ర్ ద్వారా తెలియ‌జేశాడు . బాస్ సినిమాకి మ్యూజిక్ కంపోజ్ చేయడం అనేది ఓ గొప్ప అనుభూతి , మెగాస్టార్ సినిమాకి కంపోజ్ చేయడం అనేది ప్రతి ఒక్క మ్యూజిక్ డైరెక్టర్ కి బిగెస్ట్ డ్రీమ్. ఇప్పటికి నా కల తీరబోతుంది అంటూ త‌న ఆనందాన్ని ట్విట్ట‌ర్ ద్వారా వ్యక్త ప‌రిచారు. ఈ చిత్రంలో బిగ్ బాస్ 4 విన్న‌ర్ అభిజిత్ ముఖ్య పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్టు స‌మాచారం.