చైతు నేను ఇద్దరం ఒక దగ్గర ఉంటే చేతిలో అవి ఉండకుండా చూసుకోవాలి: సమంత

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే తన అందం, అభినయంతో ప్రేక్షకులను మాయ చేసిన సమంత అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో హీరోయిన్ గా మంచి గుర్తింపు దక్కించుకుంది. టాలీవుడ్ లో ఫేమస్ అవ్వటంతో సౌత్ లో అన్ని భాషలలో స్టార్ హీరోల సరసన నటించి అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు పొందింది. సమంత నాగచైతన్య నటించిన మొదటి సినిమాతోనే ఇద్దరు ప్రేమలో పడ్డారు. చాలా కాలం ప్రేమించుకున్న వీరిద్దరూ పెద్దల అంగీకారంతో వివాహ బంధంలో అడుగుపెట్టారు.

వివాహం తర్వాత వీరిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉంటూ ఇండస్ట్రీలోనే బెస్ట్ కపుల్ గా మంచి గుర్తింపు పొందారు. అయితే కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధల కారణంగా ఒకరికి ఒకరు దూరమయ్యారు. ఇప్పటివరకు వీరిద్దరూ విడిపోవడానికి గల కారణాలు మాత్రం ఎవరికీ తెలియడం లేదు. నాగచైతన్య నుండి విడిపోయిన తర్వాత సమంత కొంతకాలం డిప్రెషన్ లో ఉంది. తర్వాత తనకి తాను ధైర్యం చెప్పుకున్న సమంత వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ కెరీర్లో బిజీ అయిపోయింది. ఇటీవల పుష్ప సినిమాలో స్పెషల్ సాంగ్ లో నటించిన సమంత దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఈ క్రమంలో నార్త్ ఇండస్ట్రీలో కూడా సమంతకు మంచి ఫాలోయింగ్ ఏర్పడింది.

ప్రస్తుతం సమంత బాలీవుడ్ సినిమాలలో కూడా నటించటానికి రెడీ అయింది. ఈ క్రమంలో బాలీవుడ్లో ప్రసారమవుతున్న ప్రముఖ రియాలిటీ షో కాఫీ విత్ కరణ్ అనే షోలో ఇటీవల పాల్గొనింది. ఎంతకాలంగా ప్రసారమవుతున్న ఈ షో కి ప్రముఖ నిర్మాత దర్శకుడు కరణ్ జోహార్ పోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ షోలో కరణ్ జోహార్ సమంత విడాకుల గురించి ప్రశ్నించాడు.
ఈ క్రమంలో ఇప్పటికీ చైతన్యతో మీరు స్నేహ పూర్వకంగా ఉన్నారా ? అని సమంతను ప్రశ్నించగా.. సమంత స్పందిస్తూ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఇద్దరినీ ఒకే దగ్గర ఉంచితే మా చేతిలో పదునైన వస్తువులు లేకుండా చూడాలి అంటూ చెప్పింది. ఇప్పుడైతే అదే పరిస్థితి ఇక భవిష్యత్తులో ఫ్రెండ్స్ లా ఉంటామేమో చూడాలి అంటూ చెప్పుకొచ్చింది. నాగచైతన్య గురించి సమంత చేసిన ఈ కామెంట్స్ కి ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు. అసలు నాగచైతన్య మీద సమంతకి ఇంత కోపం ఉండటానికి కారణమేమిటి అని చర్చించుకుంటున్నారు.