చిరు, రామ్ చ‌ర‌ణ్ మ‌ధ్య ఛేజింగ్ సీన్స్.. హైప్ పెంచ‌డం ఖాయం అంటున్న ఫ్యాన్స్

మెగాస్టార్ చిరంజీవి ప్ర‌స్తుతం కొరటాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో చిరంజీవి జోడీ గా కాజ‌ల్ అగ‌ర్వాల్ న‌టిస్తుంది. ముఖ్య పాత్ర‌లో రామ్‌చ‌ర‌ణ్ కనిపించ‌నుండ‌గా, ఆయ‌న‌కు జోడీగా పూజా హెగ్డే న‌టిస్తుంది. త్వ‌ర‌లోనే పూజా హెగ్డే యూనిట్‌తో జాయిన్ కానుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. దేవాదాయ శాఖ‌లో అవినీతిని ప్ర‌శ్నించేలా ఆచార్య‌ను కొర‌టాల తెర‌కెక్కిస్తున్నాడ‌ట‌. అందులో భాగంగా, కోకాపేట‌లో భారీ టెంపుల్ సెట్‌ను వేసి చిత్రీక‌రించారు.ఇందులో షూటింగ్ ముగిసాక చిత్ర బృందం రాజ‌మండ్రి వెళ్ళారు.

సినిమాలో కొంత భాగాన్ని చిత్రీకరించేందుకు తూర్పు గోదావరి జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతాన్ని వినియోగిస్తుండ‌గా, షూటింగ్‌లో పాల్గొనేందుకు చిరంజీవి రీసెంట్‌గా రాజ‌మండ్రి వెళ్ళారు. అక్క‌డ నుండి లొకేష‌న్‌కు కారు మార్గంలో వెళ్ళారు. చిరంజీవికి రాజ‌మండ్రిలో ఘ‌న స్వాగ‌తం ల‌భించింది. అభిమానులు కొంత దూరం వ‌ర‌కు ర్యాలీగా వెళ్ళారు. ఆయ‌న‌పై పూల జ‌ల్లు కురిపించారు. అయితే ప్ర‌స్తుతం రామ్ చ‌ర‌ణ్‌, చిరంజీవిపై కొర‌టాల కీలక స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్న‌ట్టు తెలుస్తుండగా, మూవీకి సంబంధించిన వార్త ఒక‌టి హ‌ల్‌చ‌ల్ చేస్తుంది.

చిరంజీవి, రామ్ చ‌ర‌ణ్ మ‌ధ్య కారు చేజింగ్ స‌న్నివేశాలు చేస్తున్నార‌ని, ఇది మూవీపై భారీ హైప్ క్రియేట్ చేస్తుంద‌ని అంటున్నారు. నెల 6వ తేదీ వరకు చిరంజీవి, చరణ్ అక్కడ షూటింగ్‌లో పాల్గొంటారట. అనంతరం హైదరాబాద్ తిరిగి వస్తారట. కొణిదెల ప్రొడక్షన్ కంపెని, మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ సంస్థలు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రీసెంట్‌గా మూవీకి సంబంధించిన టీజ‌ర్ విడుద‌ల కాగా, ఇది ప్ర‌తి ఒక్క‌రిని ఎంత‌గానో అల‌రించింది. మే 13న చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకువ‌చ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఈ సినిమా త‌ర్వాత చిరు లూసిఫ‌ర్, వేదాళం రీమేక్‌ల‌తో పాటు బాబీ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మూవీ చేయ‌నున్నాడు.