బ్రేకింగ్..బాలయ్య హీరోయిన్ మళ్ళీ కోవిడ్ పాజిటివ్ అట!

గత రెండేళ్లు కరోనా ఎంతలా దెబ్బ తీసిందో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా రెండో వేవ్ అయితే చాలా నష్టం కలిగించింది. దీని నుంచి ఎన్నో జాగ్రత్తలు వహించే సినీ తారలు కూడా తప్పించుకోలేకపోయారు. మరి ప్రస్తుతం నటసింహం నందమూరి బాలకృష్ణ (బాలయ్య) హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “అఖండ” కోసం అందరికీ తెలిసిందే.

బోయపాటి శ్రీను తెరకెక్కించిన ఈ చిత్రంలో యంగ్ అండ్ గ్లామరస్ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటించింది. ఇప్పుడు ఈమె కరోనా బారిన పడ్డట్టుగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా తెలిపింది. ఆల్రెడీ తనకి ఓసారి కరోనా వచ్చింది. వచ్చి తర్వాత వాక్సిన్ వేసుకున్నా కూడా ఇప్పుడు మళ్ళీ కరోనా వచ్చినట్టుగా ఆమె తెలిపింది.

ప్రస్తుతం అయితే డాక్టర్స్ సూచనతో ఐసోలేషన్ లో ఉందట. అలాగే గత కొన్ని రోజులుగా తనని కలిసిన వారు కూడా జాగ్రత్తగా ఉండాలని ప్రగ్యా తెలిపింది. ఇప్పటికే కరోనా మూడో వేవ్ పొంచి ఉంది అది కూడా ఈ అక్టోబర్ లోనే ఉందని వార్తలు ఉన్నాయి. సరిగ్గా ఇదే సమయంలో ఇలా జరగడం కాస్త ఆందోళన కలిగించే అంశమే అని చెప్పాలి. సో ఇక నుంచి అయినా అంతా జాగ్రత్తగా ఉంటే మంచింది.