Acharya Ticket Rates : బ్రేకింగ్ : “ఆచార్య” కి ఆ క్యాటగిరీలో ఏపీ ప్రభుత్వం టికెట్ ధరల హైక్..ఎంతంటే.!

Acharya Ticket Rates :  లేటెస్ట్ గా రిలీజ్ కి సిద్ధంగా ఉన్న భారీ చిత్రాల్లో మోస్ట్ అవైటెడ్ సినిమా “ఆచార్య” కూడా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లు నటించిన సాలిడ్ మల్టీ స్టారర్ చిత్రం అయినటువంటి దీని కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా మేకర్స్ మరికొన్ని రోజుల్లో రిలీజ్ చేస్తున్నారు.
అయితే ఈ సినిమాకి గాను చిత్ర బృందం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా టికెట్ ధరల పెంపుకి గాను ట్రై చెయ్యగా వాటిలో మొదటగా తెలంగాణా ప్రభుత్వం ఈ సినిమా కోసం టికెట్ ధరలు పెంచుకునే విధంగా కొత్త జీవో రిలీజ్ చేశారు. ఇక ఈరోజు ఏపీలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కొత్త జీవో ని రిలీజ్ చెయ్యడం ఆసక్తిగా మారింది.
మరి ఈ సినిమాకి గాను ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఉన్న టికెట్ ధరలకు గాను అదనంగా 50 రూపాయలు పెంచుకునే విధంగా అనుమతి జారీ చేసారు. అంతే కాకుండా ఈ హైక్ ని కూడా ఈ సినిమా సూపర్ బడ్జెట్ తో అంటే హీరోల రెమ్యునరేషన్ లు కాకుండా 100 కోట్ల బడ్జెట్ తో తీయడం మూలాన పెంచుతున్నట్టు తెలిపారు.
మరి ఈ హైక్ పది రోజుల పాటు ఉంటుంది అని తెలిపారు. అలాగే ఈ సినిమా రిలీజ్ టైం లో ఈ జీవో ఉల్లంఘన ఎక్కడా జరగకుండా ఉండాలని పోలీసులకి ఇతర ఆఫీసర్లకి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా కొరటాల శివ దర్శకత్వం వహించారు. అలాగే మణిశర్మ సంగీతం అందించారు.