అప్పటికే పొట్ట వేసుకున్న భోని కపూర్.. అతిలోక సుందరిని ఎలా పడేసాడబ్బా?

అలనాటి అందాల తార, అతిలోక సుందరి హీరోయిన్ శ్రీదేవి గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈమె భారతీయ చలనచిత్ర పరిశ్రమలో దాదాపుగా అన్ని భాషల్లో నటించి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని ఏర్పరుచుకుంది. బాల నటిగా కెరీర్ ని మొదలు పెట్టి ఈమె భారత సిని పరిశ్రమ గర్వించదగ్గ స్థాయికి ఎదిగింది.ఈమె తన అందం అభినయంతో ఎంతో మంది ప్రేక్షకుల మనసుల్ని గెలుచుకుంది. తెలుగు సినీ ప్రేక్షకులలో ఈమె పేరు విననివారు కానీ ఈమె గురించి తెలియనివారు కానీ ఉండరు.

శ్రీదేవి ఈ లోకాన్ని విడిచి వెళ్లి పోయినప్పటికీ ఇంకా ఆమె జ్ఞాపకాలు కళ్ళ ముందు అలానే కనిపిస్తూ ఉంటాయి. ఇకపోతే ఈమె బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోని కపూర్ ను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి జాన్వీ కపూర్,ఖుషి కపూర్ అనే ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. 2018లో శ్రీదేవి అకాల మరణం చెందింది. తన కూతురు జాన్వీ కపూర్ నటించిన మొదటి సినిమాను కూడా తాను చూడలేకపోయింది.తన తల్లి లేని లోటును జాన్వికపూర్ కొంతవరకు పూడుస్తోంది.

ఇదిలా ఉంటే తాజాగా బోనికపూర్ తన ఇంస్టాగ్రామ్ లో ఒక ఫోటో ని షేర్ చేసుకున్నారు. శ్రీదేవితో 34 ఏళ్ల క్రితం దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. ముంబైలోని నటరాజ్ స్టూడియోలో ఈ ఫోటో తీసుకున్నట్టు బోనీకపూర్ తెలిపారు. శ్రీదేవి తీసుకున్న మొదటి ఫోటో ఇదే అని ఆయన తెలిపారు. అయితే అప్పటికే బోనికపూర్ కి పొట్ట ఉండేది. ఇక బోనికపూర్ టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో ఎన్నో సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. ప్రస్తుతం కోలీవుడ్ లో కూడా నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వాలిమై అనే సినిమాకు ప్రొడ్యూస్ చేస్తున్నారు. సంక్రాంతి కానుకగా ఈ సినిమా విడుదల కానుందని కోలీవుడ్ వర్గాలు తెలుపు తున్నాయి.