ఇండస్ట్రీ టాక్ : చిరు కన్నా బాలయ్యే ముందు వస్తున్నాడా.?

టాలీవుడ్ సినిమా దగ్గర వచ్చే ఏడాది రిలీజ్ లు కూడా గట్టిగానే ఉన్నాయని చెప్పాలి. మరి ఈ చిత్రాల్లో అయితే సీనియర్ హీరోలు మెగాస్టార్ చిరంజీవి అలాగే నందమూరి నటసింహ బాలకృష్ణ హీరోగా నటించిన చిత్రాలు వీర సింహా రెడ్డి అలాగే వాల్తేరు వీరయ్య సినిమాలు కాగా..

ఈ చిత్రాలు రెండు ఓ రేంజ్ లో అంచనాలు తో రిలీజ్ కి రాబోతున్నాయి. మరి సంక్రాంతి రిలీజ్ కి ఈ ఇదద్రూ హీరోల నుంచి చాలా కాలం తర్వాత భారీ బాక్సాఫీస్ క్లాష్ ఇది కాగా ఈ చిత్రాల్లో ఏది ముందు వస్తుంది ఏది తర్వాత వస్తుంది అనేది ఆసక్తిగా మారుతూ వస్తున్నాయి.

అయితే ఈ చిత్రాల్లో మొదటగా వచ్చేది మాత్రం బాలయ్యే అని ఇండస్ట్రీ వర్గాలు చెప్తున్నాయి. మొదటగా బాలయ్య వీరసింహా రెడ్డి ఈ జనవరి 12న రిలీజ్ కానుండగా ఆ తర్వాత రోజే మెగాస్టార్ వాల్తేరు వీరయ్య చిత్రం జనవరి 13న రిలీజ్ కానుందట.

ఇప్పుడు లేటెస్ట్ గా ఈ టాక్ అయితే బయటకి వచ్చింది. అలాగే ఇందులో పెద్దగా మార్పు కూడా ఉండకోపోవచ్చని తెలుస్తుంది. ఇక ఈ చిత్రాల్లో చిరు సినిమాకి బాబీ దర్శకత్వం వహిస్తుండగా బాలయ్య సినిమాకి గోపీచంద్ మలినేని లు దర్శకత్వం వహిస్తున్నారు.