మొత్తానికి బాలయ్య హీరోయిన్ కి కరోనా నెగిటివ్..కానీ..

నటసింహం నందమూరి బాలకృష్ణ కృష్ణ హీరోగా తన హ్యాట్రిక్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో చేసిన సూపర్ మాస్ మసాలా డ్రామా “అఖండ”. సినిమా షూట్ అంతా సజావుగా కంప్లీట్ అయ్యింది అనుకుంటే ఊహించని రీతిలో ఈ చిత్ర హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ మళ్లీ తాను కరోనా పాజిటివ్ అయ్యానని చెప్పడం ఆందోళనకు గురి చేసింది.

అయితే మళ్లీ మధ్యలో సైలెంట్ గానే ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు ఎట్టకేలకు మళ్లీ తన హెల్త్ అప్డేట్ ఇచ్చింది. ఇప్పుడు అయితే తనకి నెగిటివ్ వచ్చింది. కానీ ఇంకో ఇంట్రెస్టింగ్ మాట కూడా చెప్తుంది. “ఈ నెగెటివ్ అనే పదం కన్నా ఇప్పుడు మరొకటి నాకు ఆనందంగా అనిపించట్లేదు” అని కరోనా నుంచి మళ్లీ కోలుకున్నాక ఎగ్జైట్ అవుతుంది. ప్రస్తుతానికి అయితే అఖండ రిలీజ్ కి సన్నాహాలు జరుగుతున్నాయి.