దొంగ సచ్చినోళ్ళు.. అంటూ అనిల్ సునీల్ ని తిట్టిపోసిన అరియానా..!

బిగ్ బాస్ నాన్ స్టాప్ సీజన్ లో 7 మంది కంటెస్టెంట్ లు ఫినాలే కి చేరుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో మిత్రశర్మ, బాబా భాస్కర్ మాస్టర్ , అనిల్ బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చాక ఇక హౌజ్ లో బిందు, అనిల్, శివ, అరియానా మాత్రమే ఉన్నారు. అప్పుడు బిగ్ బాస్ సిల్వర్ బ్రీఫ్ కేస్ ఇచ్చి యాక్టర్ సునీల్, డైరెక్టర్ అనిల్ రావిపూడి ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపించాడు. అక్కడికి వెళ్ళి వీరిద్దరు కంటెస్టెంట్ లకు డబ్బు ఆశ చూపించి వారితో డబ్బులతో బేరం చేశారు.

ఈ క్రమంలో అఖిల్ మాట్లాడుతూ.. నేనూ టైటిల్ కోసం వచ్చాను అని అనగా .. శివ టైటిల్ సొంతం చేసుకొని ఆర్థిక కష్టాలు తీర్చుకోవటానికి ఇక్కడికి వచ్చాను అని అంటాడు. బిందూ మాట్లాడుతూ.. నేనూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరవ్వటానికే ఇక్కడికి వచ్చాను అని అంటుంది. ఇక అరియానా మాత్రం నేనూ కేవలం డబ్బు కొసం మాత్రమే ఇక్కడికి వచ్చా. సొంతంగా ప్లాట్ కనుక్కోవాలన్న కోరికను నెరవేర్చుకోటానికి వచ్చాను అని అంటుంది.ఈ క్రమంలో అందరూ సైలెంట్ గా ఉన్నప్పటికీ అరియానా మాత్రం బ్రీఫ్ కేస్ లో ఉన్న డబ్బు వివరాల గురించి ఆరా తీస్తుంది.

కానీ నీ ఆ ఆ సిల్వర్ బ్రీఫ్ కేస్ లో ఎంత డబ్బు ఉంటుందో అని అరియానా ఆలోచన చేయగా.. నాగర్జున మాట్లాడుతూ అందులో కచ్చితంగా లక్షల్లో డబ్బు ఉందని హామీ ఇస్తాడు. తర్వత అరియానా ఆ సిల్వర్ బ్రీఫ్ కేస్ తీసుకొని స్టేజ్ మీదకి వస్తుంది. అయితే అరియానా స్టేజ్ పైకి వచ్చిన తర్వాత నాగార్జున, అనిల్, సునీల్‌ కలిసి ఆమెనీ ఒక ఆట ఆడుకున్నారు. అందులో డబ్బు ఉందంటే ఎలా నమ్మావ్‌ అని అరియానా కి షాక్ ఇచ్చారు. దీంతో అరియానా ఈ దొంగసచ్చినోళ్లను నమ్మి వచ్చాను అంటూ సునీల్, అనిల్ ఇద్దరిని తిట్టేసింది. కొద్ది సేపటి తర్వాత అందులో రూ. 10 లక్షలు ఉన్నాయని నాగార్జున చెప్పడంతో అరియానా ఊపిరి పీల్చుకుంది.