Anvesh: ఆంధ్రప్రదేశ్లోని విశాఖ ప్రాంతానికి చెందిన అన్వేష్.. నా అన్వేషణ పేరుతో యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి ఎంతో ఫేమస్ అయ్యారు. ఈయన దేశ విదేశాలు తిరుగుతూ అక్కడ సంస్కృతి సాంప్రదాయాలను అక్కడ పరిస్థితులను యూట్యూబ్ ఛానల్ ద్వారా అందరికీ తెలియజేస్తూ భారీగా డబ్బు సంపాదించారు. ఇలా యూట్యూబర్గా ఎంతో ఫేమస్ అయిన అన్వేష్ ఇటీవల బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న సెలబ్రిటీల గురించి యూట్యూబర్స్ గురించి పెద్ద ఎత్తున వీడియోలు బయట పెడుతూ వారిపై చర్యలు తీసుకోవడానికి కారణమయ్యారు.
ఇలా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిని అరెస్టు చేసే విషయంలో అన్వేష్ అధికారులకు ఎంతగానో సాయం చేశారు. అయితే ఇటీవల తెలంగాణ పోలీసులు అన్వేష్ కు గట్టి షాక్ ఇచ్చారు. అన్వేష్ ఇటీవల ఒక వీడియోని విడుదల చేశారు. ఇందులో భాగంగా..తెలంగాణ డీజీపీ జితేందర్ ఆధ్వర్యంలో కొందరు అధికారులు రూ.300 కోట్లు దోచేశారంటూ ఆరోపించాడు. ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా అధికారులపై ఈయన ఆరోపణలు చేయడంతో తెలంగాణ సర్కార్ సీరియస్ అవ్వడమే కాకుండా వీడియోను సుమోటోగా తీసుకుని ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలంగాణ పోలీసులు తెలిపారు.
ఇలా తనపై కేసు నమోదు కావటంతో అన్వేష్ స్పందించారు.నేను రెండు నెలలుగా బెట్టింగ్ యాప్స్ నిర్మూలన కోసం సామాజిక బాధ్యతతో అందరికి అవగాహన కల్పిస్తున్నాను. అలా చేస్తున్న నాపై కేసు పెట్టడం ఏంటో విడ్డూరంగా ఉందని తెలిపారు. ఎన్నోఏళ్లుగా మెట్రో రైలులో బెట్టింగ్ యాప్ యాడ్స్ వేస్తున్న వారిపై చర్యలు తీసుకోకుండా నాపై కేసు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు.
బెట్టింగ్ యాప్స్ కారణంగా ఎంతోమంది మరణం పొందటమే కాకుండా ఆ కుటుంబాలు చిన్న భిన్నం అయ్యాయి అలాంటి కుటుంబాలకు నేను రెండు లక్షల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తూ ఇప్పటికే ఐదు కుటుంబాలకు అండగా నిలిచానని తెలిపారు. ఇలా సామాజిక బాధ్యతతో నేను చేస్తున్న పనిని ఆడుకుంటూ నాపై కేసు పెట్టడం ఏంటి అంటూ ఈయన ప్రశ్నించిన తీరు ప్రస్తుతం సంచలనంగా మారింది.