విడాకుల దిశగా ఇంకో స్టార్ హీరోయిన్

గత కొన్నాళ్లుగా చాలా మంది సెలబ్రిటీ లు విడాకుల దిశగా వెళ్తున్నారు. అమలా పాల్, సమంత ల బాటలో ఇంకో స్టార్ హీరోయిన్ విడాకులు తీసుకుంటుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

సీనియర్ హీరోయిన్ ప్రియమణి కొన్నాళ్ల క్రితం ముస్తఫా రాజ్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది. అప్పట్లో ఆ పెళ్లి వివాదం గా మారింది. ముస్తఫా మొదటి భార్య, తనకు ఇంకా విడాకులు ఇవ్వలేదని, ప్రియమణి తో పెళ్లి జరగనివ్వమని చాలా గొడవ చేసింది. కానీ ప్రియమణి అవన్నీ పట్టించుకోకుండా ముస్తఫా ని పెళ్లి చేసుకుంది.

తాజా సమాచారం ప్రకారం ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయని, అందుకే విడిపోవడానికి సిద్ధమైనట్లు తెలుస్తుంది. ముస్తఫా పిల్లల కోసం ప్లాన్ చేయమంటే ప్రియమణి మాత్రం దానికి అంగీకరించలేదని అందుకే ఇద్దరి మధ్య గొడవలు వచ్చాయని తెలుస్తుంది.

ప్రస్తుతం ప్రియమణి రియాలిటీ షోస్ తో బిజీ గా వుంది. అలాగే ఫామిలీ మాన్ ౩ లో కూడా నటిస్తుంది. అయితే దీనిపై ప్రియమణి ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు.