శంకర్, చరణ్ ల సినిమాపై మరో ఇంట్రెస్టింగ్ సమాచారం!

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే పాన్ ఇండియా విజనరీ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ఓ భారీ పాన్ ఇండియన్ సినిమా ప్లాన్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇంకో రెండు రోజుల్లో పూణే ప్రాంతంలో స్టార్ట్ కానున్న ఈ భారీ సినిమా పై గ్లామరస్ హీరోయిన్ కియారా అద్వానీ మరోసారి ఆసక్తికరమైన సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ సినిమా కూడా శంకర్ మార్క్ లో అదిరే పొలిటికల్ డ్రామాగా అంతే కాకుండా మంచి మెసేజ్ తో కూడా ఉంటుంది అని ఇదివరకు తెలిపింది.

కానీ ఇప్పుడు తమ రోల్స్ పై ఇంకో టాక్ కూడా వచ్చింది. ఈ సినిమాలో ఎంతైతే కాన్సెప్ట్ పరంగా సినిమా ఆసక్తిగా ఉంటుందో అదే విధంగా చరణ్ కి తనకి మధ్య స్టోరీ ఉంటుంది అని శంకర్ తమ మధ్యలో మంచి లవ్ బ్యాక్ డ్రాప్ డిజైన్ చేసారని కియారా తెలిపింది. దీనితో ఈ సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ భారీ సినిమాకి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.