అభిమానులకి గుడ్ న్యూస్ చెప్పిన ఆలియా… వైరల్ అవుతున్న ఫోటో..!

బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న ఆలియా.. ఇటీవల విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యింది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ కి జోడిగా సీత పాత్రలో నటించి ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమా విడుదల అయిన తరువాత తన చిరకాల ప్రేమికుడు బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ని ఏప్రిల్ 14 వ తేదీ వివాహం చేసుకుంది. కొన్ని సంవత్సరాలుగా ప్రేమలో ఉన్న ఈ జంట ఇటీవల పెద్దల సమక్షంలో వివాహబంధంతో ఒక్కటయ్యారు.

అయితే తాజాగా ఈ అమ్మడు అభిమానులకి అదిరిపోయే శుభవార్త చెప్పింది. అదేంటంటే తొందర్లోనే ఈ అమ్మడు తల్లి కాబోతోంది. ఇంస్టాగ్రామ్ వేదికగా ఈ శుభవార్తని ఆలియా స్వయంగా షేర్ చేసింది. హాస్పిటల్ లో స్కానింగ్ తీసుకున్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ అవర్ బేబీ కమింగ్ సూన్ అంటూ పోస్ట్ చేసింది.ఈ ఫోటోలో ఆలియాతో పాటు రణబీర్ కపూర్ కూడా ఉన్నారు. ఆలియా తల్లి కాబోతున్న విషయం తెలిసి ఆమె అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ వార్త గురించి తెలుసుకున్న సెలబ్రిటీలతో పాటు ఆమె అభిమానులు కూడా ఆలియా, రణబీర్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

అయితే ఇటీవల వీరిద్దరు కలిసి బ్రహ్మాస్త్రం అనే పాన్ ఇండియా సినిమాలో ప్రధాన పాత్రలో నటించారు. భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా మొదటి భాగం శివ పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు బాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించాడు. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 9న తెలుగు, హిందీ, కన్నడ, తమిళ్, మలయాళం భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరో నాగార్జున కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు.