అఖిల్ సినిమా అప్పుడే ఓటిటిలోనా? ఇదిగో క్లారిటీ

ఎట్టకేలకు తన సినిమా ప్రయాణం మొదలు పెట్టిన ఇన్నాళ్లకు అక్కినేని యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో అఖిల్ అక్కినేని రీసెంట్ గా రిలీజ్ అయ్యిన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్” తో హిట్టు కొట్టాడు. మరి ఈ వీకెండ్స్ లో కూడా అదిరే వసూళ్లు అందుకుంటున్న ఈ చిత్రంపై తాజాగా ఓటిటి రిలీజ్ పై ఓ టాక్ వైరల్ అవుతుంది.

మరి దీని ప్రకారం ఈ చిత్రం అప్పుడే వచ్చే నెల 12న అందుబాటులోకి వచ్చేస్తుంది అని కొన్ని ట్రస్టడ్ సోర్సెస్ చెప్తున్నాయి. కానీ దీనిపై ఇప్పుడు క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రం అయితే అంత త్వరగా స్ట్రీమింగ్ కు రాదట. కాస్త టైం తీసుకొని లేట్ గానే వస్తుంది అని ఇండస్ట్రీ పీపుల్ చెబుతున్నారు.

సో అప్పుడే స్ట్రీమింగ్ కి వచ్చేస్తుంది అనే గాసిప్స్ లో ఎలాంటి నిజం లేదని ఇప్పుడు అధికారికంగా కన్ఫర్మ్ అయ్యిందని చెప్పొచ్చు. ఇక ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటించగా గోపి సుందర్ సంగీతం అందించిన సంగతి తెలిసిందే.