తెలుగమ్మాయికి ఛాన్స్ ఇచ్చిన ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. బంపర్ ఆఫ‌ర్‌తో ఉబ్బిత‌బ్బిబ‌వుతున్న ఐశ్వ‌ర్య‌

రాజ‌కీయాల వ‌ల‌న రెండేళ్ళ‌కు పైగా సినిమాల‌కు దూరంగా ఉన్న ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఇప్పుడు వ‌కీల్ సాబ్ చిత్రంతో రీఎంట్రీ ఇస్తున్నాడు. హిందీలో మంచి విజయం సాధించిన పింక్ రీమేక్‌గా ఈ చిత్రం తెర‌కెక్కింది. రీసెంట్‌గా చిత్ర షూటింగ్ పూర్తి కాగా, మార్చిలో సినిమాని రిలీజ్ చేసే అవ‌కాశం ఉంది. ఇక క్రిష్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, హ‌రీష్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ చిత్రం, సాగర్ కె చంద్ర ద‌ర్శక‌త్వంలో ప‌వ‌న్ సినిమాలు చేయ‌నుండ‌గా, ఈ ప్రాజెక్ట్‌ల‌కు సంబంధించి వ‌స్తున్న వార్త‌లు నెటిజ‌న్స్ ఆనందానికి అవ‌ధులు లేకుండా చేస్తున్నాయి.

మరి కొద్ది రోజుల‌లో క్రిష్‌- పవ‌న్ క‌ళ్యాణ్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్క‌నున్న పీరియాడిక‌ల్ చిత్రం సెట్స్ పైకి వెళ్ల‌నుండ‌గా, ఈ సినిమాకి సంబంధించి వ‌స్తున్న వార్త‌లు ఫ్యాన్స్‌లో ఉత్సాహాన్ని క‌లిగిస్తున్నాయి. తాజాగా ఈ చిత్రంలో తెలుగ‌మ్మాయి ఐశ్వ‌ర్య రాజేష్‌ని ఎంపిక చేసిన‌ట్టు తెలుస్తుంది. ఐశ్వ‌ర్య రాజేష్ తెలుగమ్మాయి అయిన‌ప్ప‌టికీ ఎక్కువ‌గా త‌మిళ సినిమాలు చేస్తుంది. ఇటీవ‌ల విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా వచ్చిన ‘వరల్డ్ ఫేమస్ లవర్’‌లో నటించి స‌త్తా చాటిన ఐశ్వ‌ర్య ఇప్పుడు నాని హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో వస్తోన్న ఓ సినిమాలో నటిస్తోంది.

ప‌వ‌న్ క‌ళ్యాణ్ సినిమాలో ఐశ్వ‌ర్య రాజేష్ ఓ గిరిజ‌న యువ‌తి పాత్ర‌లో క‌నిపించ‌నుంద‌ట‌. ఈమె ప‌వ‌న్‌ని చూసి ప్రేమ‌లో ప‌డే అమ్మాయి పాత్ర పోషిస్తుంద‌ని టాక్. ఇక పవన్ రాబిన్ హుడ్ తరహా పాత్రలో కనిపిస్తారనే వార్తలు వస్తున్నాయి. విరూపాక్ష అనే టైటిల్‌ని చిత్రానికి ప‌రిశీలిస్తుండ‌గా, దాదాపు 45 రోజుల‌లో ఈ మూవీ షూటింగ్ పూర్తి చేయాల‌ని క్రిష్ ప్లాన్ చేసుకుంటున్నాడ‌ట‌. అస‌లు ఇప్ప‌టికే షూటింగ్ మొద‌లు కావ‌ల్సి ఉండ‌గా, రీసెంట్‌గా క్రిష్ క‌రోనా బారిన ప‌డ‌డంతో కొద్ది రోజులు వాయాదా ప‌డింది. పీరియాడిక‌ల్ మూవీగా తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంకు సంబంధించిన ప్రీ లుక్ ఇప్ప‌టికే విడుద‌ల కాగా, ఇది సినిమాపై భారీ అంచ‌నాలు పెంచింది.