‘ఆహా’.! శభాష్ బాలయ్యా.!

ఓ పక్క సినిమాలూ, రాజకీయాలూ అంటూ జనంతో మమేకమవుతూనే బాలయ్య ఈ మధ్య ఓటీటీ తెరపై కూడా సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. చిన్న పిల్లాడి మనస్తత్వం అయిన బాలయ్య తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. బాలయ్య నిర్ణయంపై ఫ్యాన్స్‌తో పాటు, నెట్టింటి జనం కూడా చాలా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలయ్యపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఇంతకీ బాలయ్య తీసుకున్న ఆ కీలక నిర్ణయం ఏంటంటారా.? ‘ఆహా’ ఓటీటీ ఛానెల్ కోసం బాలయ్య ‘అన్‌స్టాపబుల్’ అనే ఓ టాక్ షోకి ఈ మధ్య కమిట్ అయిన సంగతి తెలిసిందే. దీపావళి సందర్భంగా వచ్చే నెల్లో ఈ టాక్ షో స్టార్ట్ కానుంది. మెగాస్టార్ చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సహా పలువురు ప్రముఖ సెలబ్రిటీలను ఈ టాక్ షో కోసం ఇప్పటికే ఎంగేజ్ చేసినట్టు సమాచారం.

భారీ రెమ్యునరేషన్‌ను ఈ టాక్ షో కోసం బాలయ్య తీసుకుంటున్నారంటూ ప్రచారం జరిగింది. నిజమే. కానీ, ఆ భారీ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా.? అక్షరాలా 4 కోట్లు పై మాటేనట. అయితే, ఆ భారీ మొత్తాన్ని బాలయ్య సేవా కార్యక్రమాల కోసమే వినియోగించాలనుకుంటున్నారట. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రితో పాటు, పలు ఛారిటబుల్ ట్రస్టులకు ఈ భారీ మొత్తాన్ని బాలయ్య దారాధగ్తం చేసేయాలనుకుంటున్నారట. నిజంగా ఇది అభినందించదగ్గ విషయమే కదా. అందుకే శభాష్ బాలయ్యా.! అనకుండా ఉండలేకపోతున్నాం మరి.