సమంతపై ట్వీట్, క్లారిటీ ఇచ్చిన నటుడు సిద్దార్థ్

నటుడు సిద్దార్థ త్వరలో ‘మహాసముద్రం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం విదితమే. అగ్రెసివ్ నేచర్.. అనే విమర్శ ఎదుర్కొంటోన్న అతి కొద్దిమంది నటుల్లో ఆయనా ఒకడు. గతంలో సమంత – సిద్దార్ధ మధ్య ఏదో నడుస్తోందంటూ చాలా గాసిప్స్ వినిపించాయి.

ఆ తర్వాత ఏమయ్యిందో, సిద్దూ – సమంత మధ్య గాసిప్స్ ఆగిపోయాయి. సమంత, నాగచైతన్యను పెళ్ళాడింది. ఎప్పుడైతే సమంత – నాగచైతన్య విడిపోతున్నట్లు ప్రకటించారో, అదే సమయంలో సిద్దూ నుంచి ‘మోసం’పై ట్వీట్ వచ్చింది. ఆ ట్వీట్ సమంతని ఉద్దేశించిందేనన్న ప్రచారం జరిగింది. మోసం చేసినవారెవరూ బాగుపడరన్నది ఆ ట్వీట్ సారాంశం.

దీనిపై పెను దుమారం రేగేసరికి, సిద్దూ తాజాగా స్పందించక తప్పలేదు. ‘ఆ ట్వీటుకీ, సమంత విడాకులకీ సంబంధం లేదు. నా టీచర్ నాకు చెప్పిన విషయాన్ని నేను ట్వీట్ చేశారు. దానికి సంబంధించి ఓ సన్నివేశం కూడా మహాసముద్రం సినిమాలో వుంది తెలుసా.?’ అంటూ సిద్దూ చాలా అమాయకంగా ఎదురు ప్రశ్నించేశాడు.

మంచి మాటకారి అయిన సిద్దార్థ ప్రస్తుతానికైతే బాగానే కవర్ చేశాడు. కానీ, ఆయన ట్వీటులో ఆంతర్యమేంటో అందరికీ అర్థమయిపోయింది.