“మేజర్” సినిమాపై ఎమోషనల్ అయ్యిన నటుడు ప్రకాష్ రాజ్.!

ఇండియన్ సినిమా దగ్గర ఎలాంటి పాత్రని అయినా కూడా అద్భుతంగా రక్తి కట్టించే సాలీడ్ పెర్ఫామర్స్ లో నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఒకరు. దాదాపు భారతీయ భాషల్లో ఉన్న అన్ని ఇండస్ట్రీలలో కూడా నటించి మెప్పించిన ప్రకాష్ రాజ్ రీసెంట్ గా నటించిన భారీ చిత్రమే “మేజర్”.

టాలెంటెడ్ హీరో అడివి శేష్ మేజర్ సందీప్ ఉన్ని కృష్ణన్ లైఫ్ స్టోరీ పై నటించిన ఈ చిత్రం మరికొన్ని రోజుల్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రిలీజ్ కాబోతుంది. అయితే ఈ సినిమా ఒక అద్భుతమైన ఎమోషనల్ ఏక్షన్ ఎంటెర్టైనెర్ కాగా ఈ సినిమా స్పెషల్ షో లు చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఎంతో ఎమోషనల్ అయ్యిపోతున్నారు.

మరి అంతలా ప్రభావితం చేస్తున్న ఈ సినిమాపై అందులో తన జర్నీ పై నటుడు ప్రకాష్ రాజ్ కూడా ఒకింత ఎమోషనల్ గానే ఉన్నారు. తాను మాట్లాడుతూ ఈ సినిమా నా హృదయానికి ఎంతో దగ్గరైనది అని ఈ చిత్రంలో నటించినందుకు నేను ఎంతో గర్వగంగా భావిస్తున్నాను.

అడివి శేష్, నిర్మాత మహేష్ బాబులతో ప్రయాణం ఎంతో బాగుంది. ఈ సినిమా ఖచ్చితంగా ప్రతి ఒక్కరి హృదయాలను కదిలిస్తుంది అని ప్రకాష్ రాజ్ ఈ సినిమా పట్ల ఎమోషనల్ అయ్యారు. దీనితో ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ గా మారింది.