‘Acharya’ Trailer : రొటీన్ గా ‘ఆచార్య’ ట్రైలర్

‘Acharya’ Trailer : మెగాస్టార్ చిరంజీవి- రామ్ చరణ్ ల కాంబినేషన్ లో మల్టీ స్టారర్ ‘ఆచార్య’ ట్రైలర్ మంగళవారం సాయంత్రం 7 గంటలకు విడుదలైంది.దీనికి ముందు సాయంత్రం 5 గంటల 49 నిమిషాలకి థియేట్రీకల్ ట్రైలర్ విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేసింది.

గ్రామీణ నేపథ్యంలో ఆలయాల్లో అక్రమాలకు సంబంధించిన కథతో తెరకెక్కిన ‘ఆచార్య’ ట్రైలర్ చుట్టూ అడవులున్న పాడమట్టం గ్రామాన్ని చూపిస్తూ ప్రారంభమవుతుంది.

అమ్మవారి ఆలయానికి పేరుగాంచిన ఈ గ్రామానికి రామ్ చరణ్ సంరక్షకుడి పాత్రలో ఎంట్రీ ఇచ్చి దుష్టుల్ని చావచితకదంతాడు.ఆలయ పూజారిగా తనికెళ్ళ భరణి కన్నీళ్లు పెట్టుకుంటూ కనిపిస్తాడు.దీని తర్వాత చిరంజీవి ఎంట్రీ ఇస్తాడు- విలన్ గా నటించిన సోనూ సూద్ తో యాక్షన్ సీనుతో.

ఈ ట్రైలర్ లో ఆలయ అక్రమాల కథేమిటో పూర్తిగా స్పష్టం గాదు. ఒకదాని తర్వాత ఒకటి చిరంజీవి యాక్షన్ సీన్సే వస్తాయి,

ట్రైలర్ చివరి భాగంలో చిరంజీవి, రామ్ చరణ్ జత కలిసి దుష్ట శిక్షణ చేస్తారు.ట్రైలర్ లో నేపథ్యంలో కూడా పాటలు వినిపించలేదు.అలాగే హీరోయిన్లకి ప్రాధాన్యం కనిపించలేదు. విజువల్స్ బ్రహ్మాండంగా వున్నాయి.
‘ధర్మస్థలి అధర్మస్థలి ఎలా అవుతుంది’ అన్న రామ్ చరణ్ డైలాగు, ‘పాదఘట్టం వాళ్ళ గుండెలపై కాలు వేస్తే ఆ కాలు తీసేయాలట’ అన్న చిరంజీవి డైలాగులు పవర్ఫుల్ గా లేవు.

కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఈ నెల 29 నా విడుదలవుతుంది.

Acharya Trailer - Megastar Chiranjeevi, Ram Charan | Koratala Siva | Mani Sharma | Niranjan Reddy