క‌రోనా ప‌రీక్ష చేయించుకున్న కుర్ర హీరో.. వీడియో షేర్ చేయ‌డంతో వైర‌ల్‌

ప్ర‌పంచం ప్ర‌శాంతంగా సాగుతున్న స‌మ‌యంలో ఎవ‌రూ ఊహించ‌ని కరోనా మ‌హ‌మ్మారి భూమిపై అడుగుపెట్టి మాన‌వాళిని చిన్నాభిన్నం చేసింది. క‌రోనా దెబ్బ‌కు అంద‌రి జీవితాలు ఆగ‌మాగం అయ్యాయి. ఒక్క రాష్ట్రం,దేశంకి కాదు ప్రపంచానికి మొత్తం చుక్క‌లు చూపించింది ఈ క‌రోనా వైర‌స్. అయితే క‌రోనా వ‌ల‌న కొన్నాళ్ళు ఆగిన సినిమా షూటింగ్‌లు ఇప్పుడు వ‌డివ‌డిగా చిత్రీక‌ర‌ణ జ‌రుపుకుంటున్నాయి. కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ, త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ షూటింగ్స్ చేస్తున్నారు. అంతేకాదు సెట్‌లో అడుగుపెట్టే ముందు వ్యక్తిగత భద్రత, సామాజిక బాధ్యతలో భాగంగా ఎప్పటికప్పుడు కొవిడ్ పరీక్షలు చేయించుకుంటున్నారు.

తాజాగా సాయి కుమార్ త‌న‌యుడు ఆది సాయికుమార్ క‌రోనా ప‌రీక్ష చేయించుకున్నారు. ఆ ప‌రీక్ష చేసే స‌మ‌యంలో తీసిన వీడియోని త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయ‌గా, ఆయ‌న‌కు క‌రోనా ప‌రీక్ష‌లో పాజిటివ్ వ‌చ్చిందా, నెగెటివ్ వ‌చ్చిందా అనే దానిపై ఆలోచ‌న‌లు చేస్తున్నారు. వీడియో అయితే పెట్టావు కాని రిపోర్ట్ ఏంట‌న్న‌ది చెప్ప‌లేదేంట‌న్నా అంటూ నెటిజ‌న్స్ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. అయితే కెరీర్‌లో మంచి హిట్ కూడా కొట్ట‌ని ఆది ఇప్పుడు శ‌శి అనే సినిమా ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌తో బిజీగా ఉన్నాడు.

శ‌శి చిత్రం ఫిబ్ర‌వ‌రి 12న ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా, ఇందులో క‌థానాయిక‌గా సుర‌భి న‌టిస్తుంది. శ్రీ హ‌నుమాన్ మూవీ మేక‌ర్స్ ప‌తాకంపై ఆర్‌.పి. వ‌ర్మ, సి. రామాంజ‌నేయులు, చింత‌ల‌పూడి శ్రీ‌నివాసరావు నిర్మించిన ఈ చిత్రాన్ని శ్రీనివాస్ నాయుడు తెర‌కెక్కించారు. అరుణ్ చిలువేరు సంగీతం సమకూర్చారు. అమరనాథ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫి అందించారు. త‌న తండ్రి బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశాడు ఆది. దీనికి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.