80 ఏళ్ల వృద్ధుడికి రూ.80 కోట్ల విద్యుత్‌ బిల్లు !

సాధారణంగా కోటీశ్వరులకు కూడా నెలవారి కరెంట్ బిల్లు లక్షల్లో రాదు. ఇక సామాన్య ప్రజానీకానికి అయితే, వందలు లేదా వేలాది రూపాయల్లో వస్తుంది. వేసవిలో అయితే కాస్తంత ఎక్కువ మొత్తంలో వస్తుంది. అలాంటి ఓ సామాన్య వృద్ధుడుకి ఏకంగా రూ.80 కోట్లలో కరెంట్ బిల్లు వచ్చింది. దాన్ని చూడగానే ఆయనకు గుండె ఆగిపోయినంతపని అయింది.

ganpat naik

కరెంట్‌ బిల్లు చూసి ఆ వృద్ధుడికి నిజంగానే షాక్‌ తగిలింది. బీపీ అమాంతం పెరిగిపోయింది. దీంతో స్మృహ కోల్పోయి కిందపడిపోయాడు. ఆ వెంటనే ఆస్పత్రికి తరలించారు. మహారాష్ట్ర నలసోపారా టౌన్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే నలసోపార్ టౌన్‌కు చెందిన గణ్‌పత్‌ నాయక్‌ అనే వృద్ధుడు స్థానికంగానే రైస్‌ మిల్లు నడుపుతున్నాడు. ఈ మిల్లుకు కరెంట్ బిల్లు వచ్చింది. దాన్ని చూడగానే ఆయన ఒకింత షాక్‌కు గురయ్యాడు. అది వేలల్లో కాదు ఏకంగా రూ.కోట్లల్లో కరెంట్‌ బిల్లు వచ్చింది. 80 కోట్ల రూపాయల కరెంట్‌ బిల్లు చూసి అతడి బీపీ పెరిగింది. కింద పడిపోయాడు. వెంటనే ఆస్పత్రికి తరలించారు.

ఈ ఘటనపై మహారాష్ట్ర స్టేట్‌ ఎలక్ట్రిసిటీ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ లిమిటెడ్‌(ఎంఎస్‌ఈడీసీఎల్‌) స్పందించింది. ఇది అనుకోకుండా జరిగిన తప్పిదమని.. తర్వలోనే బిల్లును సరిచేస్తామన్నారు. మీటర్ రీడింగ్ తీసుకునే ఏజెన్సీ చేసిన తప్పిదం వల్ల ఈ ఘటన చోటుచేసుకుంది అని వెల్లడించారు.