ర‌జినీ, విజ‌య్‌లపై.. సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసిన న‌టి..!

కోలీవుడ్ సూప‌ర్ స్టార్ ర‌జినీ కాంత్, ఇళ‌య ద‌ళ‌ప‌తి విజ‌య్‌ల పై వివాదాస్ప‌ద న‌టి మీరా మిథున్ తాజాగా చేసిన ఆరోప‌ణ‌లు త‌మిళ్ ఇండ‌స్ట్రీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే.. ర‌జ‌నీ కాంత్, విజ‌య్‌లు, కోలీవుడ్‌లో త‌న ఎద‌గ‌నీయ‌కుండా చేశార‌ని తీవ్ర‌మైన ఆరోప‌ణ‌లు చేసింది. ఓ కండ‌క్ట‌ర్, మ‌రో క్రిస్టియ‌న్ క‌లిసి త‌న పేరును చెడ‌గొట్టేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని, ర‌జనీ, విజ‌య్‌ల‌పై వివాదాస్ప‌ద ట్విట్ట‌ర్‌లో వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసింది.

ఇక అంత‌టితో ఆగ‌ని మీరా మిథున్ త్వ‌ర‌లో త‌మిళ‌నాడుకు కాబోయే ముఖ్య‌మంత్రి తానేనంటూ జ్యోస్యం చెప్పింది. ఈ క్ర‌మంలో తాను త‌మిళ‌నాడును ద‌హించి వేస్తాన‌ని హెచ్చరించింది. అయితే మ‌రోవైపు మీరా చేసిన వ్యాఖ్య‌ల పై సోష‌ల్ మీడియాలో పలువురు తీవ్ర‌మైన అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తున్నారు. ముఖ్యంగా ర‌జినీ, విజ‌య్‌ల అభిమానులు అయితే ఆమె పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డుతున్నారు. త‌మ అభిమాన హీరోల పై దిక్కుమాలిన విమ‌ర్శ‌లు చేసి ఫేమ్ పొందాల‌ను కుంటున్న మీరా పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

ఇక మీరా మిథున్ విష‌యానికి వ‌స్తే.. 2016లో ఫెమీనా మిస్ సౌత్‌గా కిరీటాన్ని గెలుచుకున్న మీరా, త‌న నోటి దురుసు కారణంగా ఆ కిరీటాన్ని కోల్పోయింది. అలాగే త‌మిళ బిగ్‌బాస్ షోలో పాల్గొన్న మీరా, హోస్ట్ క‌మ‌ల్ హాస‌న్ పై కూడా ఆరోప‌ణ‌లు చేసింది. బిగ్‌బాస్ షోలో భాగంగా ద‌ర్శ‌కుడు చేర‌న్ త‌న‌తో అస‌భ్యంగా ప్ర‌వ‌ర్తించినా క‌మ‌ల్ హాహ‌న్ ఖండించ‌లేద‌ని అప్ప‌ట్లో మీరా పెద్ద ర‌చ్చే చేసింది. ఆ త‌ర్వాత ఇండ‌స్ట్రీలో త‌న‌కు అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో, ఇలా సినీ ప్ర‌ముఖుల్ని టార్గెట్ చేసి వార్త‌ల్లో నిల‌వ‌డానికి ప్ర‌య‌త్నిస్తోంద‌ని కోలీవుడ్ జ‌నాలు చ‌ర్చించుకుంటున్నారు.