నయనతారలో ఏదో ప్రత్యేకత ఉందట.. అదేంటో మరి.. !?
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ మేకప్ బ్రాండ్ ‘కే’ KAY కు నయనతార బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. అయితే .. నయనతార పై కత్రినా ప్రశంసల జల్లు కురిపించారు. అవి ఆమె మాటల్లోనే.. ”టాలీవుడ్, కోలీవుడ్ లో నయనతార నటన, తన సంకల్పం చూసి ఎంతో ఆశ్చర్యపోయాను. తను అన్ని పాత్రలను అవలీలగా పోషిస్తోంది. ఆమెలో ఏదో ప్రత్యేకత ఉంది. అంతేగాక, తను చేసే పనికి కట్టుబడి ఉంటుంది. అంతేకాదు అద్భుత నటి కూడా. అయినప్పటికీ నిరాడంబరంగా ఉంటారు. అది నన్ను చాలా ఆకర్షించింది” అంటూ నయనతారతో కలిసి పనిచేసిన అనుభవం గురించి చెప్పుకొచ్చారు కత్రినా కైఫ్ ఓ సందర్భంలో.
ఈ నేపథ్యంలో KAY ప్రచార ప్రకటన కోసం నయన్ ఇటీవల ముంబై వెళ్ళింది. తన మేకప్ బ్రాండ్ ప్రకటన కోసం నమనతార సమయాన్ని కేటాయించినందుకు కత్రినా సోషల్ మీడియా వేదికగా ధన్యవాదాలు తెలిపారు… ‘సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతారకు ధన్యవాదాలు. మీ బిజీ షెడ్యూల్లో కూడా ముంబై వచ్చి.. మా మేకప్ బ్రాండ్ ప్రకటనకు మీ సమయాన్ని కేటాయించినందుకు ధన్యవాదాలు. మీ ఉదారతకు.. అందానికి ఎప్పటికీ సలాం’ అంటూ తన ఇన్స్టాలో రాసుకొచ్చారు.ఇటీవల సూపర్ స్టార్ రజనీకాంత్ సరసన ‘దర్భార్’లో నటించిన నయనతార ప్రస్తుతం విజయ్ సేతుపతితో కలిసి తమిళ చిత్రంలో నటిస్తున్నట్లు సమాచారం.
నయనతార, సమంత హీరోయిన్లుగా, విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించనున్న ఈ సినిమాకు ‘కాదువాక్కుల రెండు కాదల్’ అనే టైటిల్ పెట్టారు.. ముక్కోణపు ప్రేమకథగా ..
వినోద ప్రధానంగా సాగే ..ఈ సినిమా షూటింగ్ మేలో ప్రారంభం కావాల్సి ఉంది. కరోనా వల్ల ఆగింది. త్వరలోనే సినిమా షూటింగ్స్కి అనుమతి లభిస్తుందనే ఉద్దేశంతో ఆగస్ట్ నెల నుంచి ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించాలనుకుంటున్నారని తెలిసింది. అయితే.. లాక్డౌన్ వల్ల సినిమా షూటింగ్లన్నీ నిలిచిపోవడంతో సినీ కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఈ తరుణంలో పేద సినీ కార్మికులను ఆదుకునేందుకు నయనతార సైతం ముందుకు వచ్చారు. తన వంతు బాధ్యతగా ‘ఫిల్మ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ సౌతిండియా'(ఫెఫ్సీ)కి 20 లక్షల విరాళం ప్రకటించారు. వావ్.. దటీజ్ నయనతార!