డివైడ్ టాక్ తో కూడా దుమ్ము లేపిన మహేష్..మరో 200 కోట్ల వసూళ్లు.!

Sarkaru Vaari Paata

టాలీవుడ్ ప్రిన్స్, సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా “సర్కారు వారి పాట” కోసం అందరికీ తెలిసిందే. దర్శకుడు పరశురామ్ పెట్ల అలాగే హీరోయిన్ కీర్తి సురేష్ లతో మహేష్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ ఇది. అయితే సినిమాపై నెలకొన్న అంచనాలకు తగ్గట్టుగా సాలిడ్ ఓపెనింగ్స్ ని అందుకున్న ఈ సినిమా ఆ వసూళ్లతో పాటుగా మొదటి రోజే బాగా మిక్సిడ్ రివ్యూస్ ని డివైడ్ మౌత్ టాక్ ని అందుకుంది.

అయితే ఈ సినిమా ఆ టాక్ తో కూడా రికార్డు వసూళ్లు కొల్లగొతున్నట్టు చిత్ర బృందం అధికారికంగా వసూళ్ల పోస్టర్స్ తో తెలియజేస్తున్నారు. అయితే మొన్నటితో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 196.4 కోట్ల గ్రాస్ ని అందుకోగా నిన్నటి వసూళ్లతో ఖచ్చితంగా 200 కోట్ల రికార్డు గ్రాస్ మార్క్ ని అందుకుంటుంది అని ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయపడ్డారు.

అయితే దాన్ని నిజం చేస్తూ నిన్నటి వసూళ్లతో ఈ సినిమా 200 కోట్ల గ్రాస్ ని అందుకున్నట్టు కన్ఫర్మ్ చేశారు. దీనితో మహేష్ ఖాతాలో తన లాస్ట్ సూపర్ హిట్ సినిమా సరిలేరు నీకెవ్వరు తర్వాత వరుసగా మరో 200 కోట్లు గ్రాస్ అందుకున్న సినిమాగా ఇది నిలిచింది. ఇంకా ఈ సినిమాలో నదియా, సముద్రఖని తదితరులు కీలక పాత్రల్లో నటించగా థమన్ సంగీతం ఇచ్చాడు. అలాగే మైత్రి మూవీ మేకర్స్ 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ తో మహేష్ కూడా భాగస్వామి అయ్యి ఈ సినిమాని నిర్మాణం వహించారు.