Gandhi Talks: ప్రముఖ నిర్మాణ సంస్థ జీ స్టూడియోస్ నిర్మిస్తోన్న ప్రెస్టీజియస్ మూవీ ‘గాంధీ టాక్స్’కు సంబంధించి విడుదల తేదిని అధికారికంగా అనౌన్స్ చేసింది. ఈ మూవీ జనవరి 30న గ్రాండ్ రిలీజ్ అవుతుంది. ఇండియన్ సినిమాల్లో అరుదైన సైలెంట్ ఫిల్మ్గా ‘గాంధీ టాక్స్’ రూపొందింది. కథను వివరించటానికి మాటల కంటే నిశ్శబ్దం బలమైన అంశంగా నిలుస్తోంది. ఇది సినీ ప్రపంచంలో ధైర్యమైన, సృజనాత్మకమైన అడుగు.
సినిమాను ఎంత గ్రాండియర్గా, ఎలాంటి సౌండ్తో రూపొందించారంటూ లెక్కలు వేసే నేటి రోజుల్లో గాంధీ టాక్స్ సినిమా తన సందేశాన్ని శాంతియుతంగా, ఎలాంటి శబ్దాలు లేకుండా, భావోద్వేగాలతో చెప్పబోతుంది. ఇందులో విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి, అదితి రావ్ హైదరి, సిద్ధార్థ్ జాధవ్ వంటి అద్భుతమైన నటీనటులు నటించారు. వీరందరూ తమ హావభావాలతో, నటనతో స్టోరీని అందరికీ తెలియజేస్తున్నారు.
విజయ్ సేతుపతి, అరవింద్ స్వామి వంటి స్టార్స్ ఈ సైలెంట్ ఫిల్మ్లో నటించటానికి ఒప్పుకున్నారంటే సినిమా అనేది నటన ఆధారిత సినిమా అని కూడా నిరూపించే ప్రయత్నం చేయటమే. ఇది నిజంగా అతి పెద్ద ఛాలెంజ్. రొటీన్కు భిన్నమైన, ఛాలెంజింగ్ పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్న వీరి తీరు వారి సినిమా అంటే వారికున్న ప్యాషన్ను తెలియజేస్తోంది. అదితి రావు హైదరి, సిద్ధార్థ్ జాదవ్ వంటి స్టార్స్ పాత్రల భావాన్ని, సన్నివేశాల డెప్త్ను మాటలు లేకుండా హావభావాలతో కథను నెరేట్ చేయటంలో ప్రత్యేకతను చూపిస్తుంటారు.

సినిమాకు ఎ.ఆర్.రెహమాన్ సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ఆయన గాంధీ టాక్స్ చిత్రానికి ఎమోషనల్ వాయిస్గా నిలుస్తున్నారు. మాటలు లేకుండా రూపొందుతోన్న ఈ సినిమాకు రెహమాన్ సంగీతం నెరేటర్గా మారుతూ సినిమాలోని డెప్త్ను ప్రేక్షకులకు తెలియజేస్తోంది. ఆయన సంగీతం నిశ్శబ్దాన్ని శక్తివంతమైన, మానసికంగా గల అనుభవంగా మార్చి, సినిమాను ప్రపంచ స్థాయి, ఫెస్టివల్-తయారైన కళాకృతిగా నిలబెడుతోంది.
ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు కిషోర్ బెలేకర్ మాట్లాడుతూ ‘‘నిశ్శబ్దం అనే నమ్మి గాంధీ టాక్స్ సినిమా ను రూపొందించాం. శతాబ్దంగా ఇండియన్ సినీ మేకర్స్ పలు రకాలైన కథలతో సినిమాలు చేస్తున్నారు. ఇలాంటి కళలో పెర్ఫామెన్సెస్, ఎమోషన్స్ను బేస్ చేసుకుని సినిమా చేయాలనుకున్నాం. నటీనటులు దీనికి ఈ కొత్త ప్రయత్నంలో భాగం కావటానికి ముందుకు రావటంతో పాటు సున్నితమైన భావాలను చక్కగా పలికించారు. అదే సమయంలో ఎ.ఆర్.రెహమాన్గారి సంగీతం.. సినిమా కథను చెప్పే వాయిస్గా మారింది. జీస్టూడియోస్, మీరా చోప్రా గారి సహకారంతో ధైర్యంగా, నిజాయతీగా కొత్త ప్రయత్నాన్ని చేశాం ’’ అన్నారు.
సినిమా సాంప్రదాయాలను సవాల్ చేసేలా, కొత్తదనంతో, ప్రతిష్టాత్మకంగా కథను చెప్పేలా ఉండే సినిమాలకు మద్ధతు ఇచ్చే నిబద్ధతను జీ స్టూడియోస్ మరోసారి ఈ ప్రయత్నంతో తెలియజేసింది. ఇది భారతీయ సినిమాకు ఇండియన్ సినిమాకు కొత్త భాష, దిశను తెలియజేస్తుంది.
జనవరి 30, 2026న విడుదలకాబోతోన్న గాంధీ టాక్స్.. నిశ్శబ్దం ద్వారా ఎంతో చెప్పగలమనే కొత్త సినిమాటిక్ అనుభవాన్ని ప్రేక్షకులకు అందించనుంది.

