కుటుంబంలోని ప్రతి ఒక్కరూ చూసేలా నా 75వ మూవీ ‘సైంధవ్‌’ని తీశాం: విక్టరీ వెంకటేష్

విక్టరీ వెంకటేష్ 75 మైల్ స్టోన్, మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ‘సైంధవ్’. వెరీ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శైలేష్ కొలను దర్శకత్వం వహించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల వస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్ ట్రెమండస్ రెస్పాన్స్ తో హ్యుజ్ బజ్ ని క్రియేట్ చేశాయి. నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత వెంకట్ బోయనపల్లి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం జనవరి 13న గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపధ్యంలో వైజాగ్ లో నిర్వహించిన ‘సైంధవ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా జరిగింది.

ప్రీరిలీజ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. నా తొలి సినిమా నుంచీ వైజాగ్ తో అనుబంధం ఉంది. కలియుగ పాండవులు, సుందరకాండ, మల్లీశ్వరి. సీతమ్మ వాకిట్లో, గోపాలగోపాల ఇలా చాలా చిత్రాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి. ‘సైంధవ్‌’ చిత్రీకరణ కూడా చాలా రోజులు ఇక్కడే చేశాం. అభిమానులు, ప్రేక్షకులు నాపై చూపించిన ప్రేమకు ధన్యవాదాలు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ చూసేలా నా 75వ చిత్రంగా న్యూ ఏజ్ యాక్షన్, ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా ‘సైంధవ్‌’ని తీశాం. దర్శకుడు శైలేష్ అద్భుతంగా ప్రజంట్ చేశారు. మీకు నచ్చే యాక్షన్ చాలా కొత్తగా చేశాను. మంచి సినిమా ఇవ్వాలని అందరం కష్టపడి పని చేశాం. ఇది పండగ రోజు వస్తుంది. పండగే పండగ అన్నట్టుగా ఉంటుంది. జనవరి 13న మీ ముందుకు వస్తోంది. బ్రహ్మండంగా వుంటుంది. తప్పకుండా చూడండి. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా మనస్పూర్తిగా థాంక్స్. ఈ సినిమాకి హీరో సారా పాపే. చాలా అద్భుతంగా నటించింది. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ సంక్రాంతి. జనవరి 13. మీరంతా రావాలి. సినిమా చూడాలి’ అని కోరారు

దర్శకుడు శైలేష్ కొలను మాట్లాడుతూ.. వైజాగ్ తో నాకు చాలా మంచి అనుబంధం వుంది. HIT చిత్రాలు ఇక్కడ చిత్రీకరణ జరుపుకున్నాయి. ఇప్పుడు ‘సైంధవ్‌’ కూడా ఇక్కడ చిత్రీకరణ చేశాం అద్భుతమైన నటులతో అందమైన సినిమాగా ‘సైంధవ్‌ తీశాం. ఇందులో చాలా మంచి డ్రామా ఉంది. వెంకటేశ్‌ గారిని ఎప్పుడూ చూడని రకంగా చూపించేందుకు ప్రయత్నించా. జనవరి 13న వెళ్లి అందరూ సినిమాని ఎంజాయ్ చేయాలి. ఈ సినిమాకి ముందు కమల్‌హాసన్‌ గారికి అభిమానిని అని చెప్పుకునేవాడిని. ఈ సినిమా ప్రయాణం తర్వాత వెంకటేశ్‌ గారి కూడా అభిమానిని కూడా అయిపోయా. వెంకటేష్ గారి 75వ చిత్రం చేసే అవకాశం రావడం నా అదృష్టం. దీనికి న్యాయం చేశానని నమ్ముతున్నాను. టీం అంతా ప్రాణం పెట్టి పనిచేశాం. కాస్ట్యుమ్స్ నీరజ కోనా, ఆర్ట్ డైరెక్టర్ అవినాస్ కొల్లా, ఎడిటర్ గ్యారీ, డీవోపీ మణికందన్, సంగీత దర్శకుడు సంతోష్ నారాయణ్ అద్భుతమైన వర్క్ ఇచ్చారు. రుహానీ శర్మ, ఆర్య, ఆండ్రియా అద్భుతమైన నటన కనబరిచారు. శ్రద్దా మనోజ్ఞా పాత్రలో ఆకట్టుకుంటారు. నవాజుద్దీన్‌ సిద్దిఖీ గారిని తెలుగు లో లాంచ్ చేసే అవకాశం నాకు రావడం గొప్ప అదృష్టం. నవాజుద్దీన్‌ సిద్దిఖీ పాత్రని ప్రేక్షకులు సెలబ్రేట్ చేసుకుంటారు. భయపెడతారు నవ్విస్తుంటారు. అది మీరు థియేటర్ లోనే చూడాలి. వెంకటేష్ గారితో ప్రయాణం మర్చిపోలేనిది. ఆయన నా జీవితాన్ని మార్చేశారు. సినిమాని గొప్పగా తీశాననే నమ్ముతున్నాను. వెంకీ మామ 75వ చిత్రాన్ని సెలబ్రేట్ చేసుకునే భాద్యత ప్రేక్షకులు,అభిమానులది. జనవరి 13న థియేటర్స్ లోకి వెళ్లి సెలబ్రేట్ చేయండి. నిర్మాత వెంకట్ గారి ధన్యవాదాలు. వారితో మళ్ళీ సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. జనవరి 13న అందరూ థియేటర్స్ కి వెళ్లి సైంధవ్ ని ఎంజాయ్ చేయండి” అని కోరారు.

నవాజుద్దీన్‌ సిద్దిఖీ మాట్లాడుతూ.. ఈ అద్భుతమైన ప్రాజెక్ట్ లో భాగం కావడం ఆనందంగా వుంది. వెంకటేష్ గారి, శైలేష్ కి, నిర్మాత వెంకట్ గారికి ధన్యవాదాలు. వెంకటేష్ గారిని ఇందులో డిఫరెంట్ అవతార్ లో చూస్తారు. ఆయన మనల్ని ఆశ్చర్యపరుస్తారు. దర్శకుడు ఇందులో నా పాత్రని చాలా కొత్తగా డిజైన్ చేశారు. జనవరి 13న అందరూ థియేటర్స్ కి వచ్చి ఎంజాయ్ చేయాలి’ అని కోరారు.

శ్రద్ధా శ్రీనాథ్‌ మాట్లాడుతూ.. వెంకటేష్ గారి 75వ సినిమాలో నటిచండం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా అందరి హృదయాల్ని గెలుచుకోవాలని, థియేటర్‌ నుంచి బయటికొస్తే అందరి మొహాల్లో ఓ ఆనందం ఉండాలి. అది ఈ చిత్రంతో కలుగుతుంది. నిర్మాత వెంకట్ గారికి ధన్యవాదాలు. శైలేష్ అద్భుతంగా సినిమాని తీశారు. టీంలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. జనవరి 13న అందరూ సినిమా చూసి ఎంజాయ్ చేయాలి’ అని కోరారు.

రుహాని శర్మ మాట్లాడుతూ.. సైంధవ్ లో అన్నీ ఎమోషన్స్ వున్నాయి. ఈ సినిమా చూసి థియేటర్‌ నుంచి బయటికొస్తే అందరి మొహాల్లో ఓ ఆనందం వుంటుంది. ప్రతి పాత్ర, ప్రతి భావోద్వేగం నచ్చుతుంది. వెంకటేష్ గారికి నేను ఫ్యాన్ ని. ఆయనతో వర్క్ చేసిన తర్వాత ఇంకా పెద్ద ఫ్యాన్ అయిపోయాను. నిర్మాత వెంకట్ గారికి ధన్యవాదాలు. ‘హిట్‌’ తర్వాత ఈ సినిమాలో మళ్లీ ఓ పవర్ ఫుల్ పాత్రని ఇచ్చినందుకు శైలేశ్‌కి కృతజ్ఞతలు. ఫస్ట్ సినిమాతో హిట్ కొట్టాం. సెకండ్ సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టేస్తాం” అన్నారు

నిర్మాత వెంకట్ బోయినపల్లి మాట్లాడుతూ.. ఈ సినిమాకి పని చేసిన అందరికీ నా కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశాం. ఆర్ట్ డైరెక్టర్ అవినాస్ కొల్లా, ఎడిటర్ గ్యారీ, డీవోపీ మణికందన్ మా టీం అందరికీ ధన్యవాదాలు. రామజోగయ్య శాస్త్రి గారు మంచి పాటలు రాశారు. రుహని, శ్రద్దా చక్కని పాత్రలు చేశారు. నవాజుద్దీన్‌ గారితో వర్క్ చేయడం ఆనందంగా వుంది. ఇది వెంకటేష్ గారి వలెనే సాధ్యమైయింది. శైలేష్ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. ఈ ప్రాజెక్ట్ క్రెడిట్ ఆయనకి దక్కుతుంది. నా తొలి చిత్రాన్ని వెంకటేష్ గారితో చేయాలని అనుకున్నాను. కానీ అది కుదరలేదు. ఆయన తొలిసారి బ్రహ్మపుత్రుడు అనే సినిమా షూటింగ్ లో తొలిసారి చూశాను. అప్పటి నుంచి ఆయన అభిమానిని. ఆయన 75వ మైల్ స్టోన్ మూవీగా ఈ చిత్రాన్ని నేను నిర్మించడం అదృష్టంగా భావిస్తున్నాను. వెంకటేష్ గారికి కృతజ్ఞతలు’’ తెలిపారు.

రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ ‘‘.. వెంకటేష్ గారు అందరికీ స్ఫూర్తి. యాక్షన్‌ చేసే హీరోలు ఉంటారు. సెంటిమెంట్‌ బాగా చేసే హీరోలు ఉంటారు. ఈ రెండింటినీ కలిపి చేసే హీరోలు కొంతమందే. అందులో మొదటి వరసలో ఉండే హీరో వెంకటేశ్‌ గారు. ఇందులో మంచి సాహిత్య విలువలతో కూడిన పాటలు రాశాను. క్లైమాక్స్ లో వచ్చే బిట్ సింగ్స్ కూడా ఆకట్టుకుంటాయి. ఇది గొప్ప చిత్రం, చరిత్రని తిరగరాసే చిత్రం అవుతుంది. ఇందులో నాతో చిన్న క్యామియో రోల్ కూడా చేయించారు శైలేష్. సంతోష్ నారాయణ్ చాలా అద్భుతమైన సంగీతం అందించారు. జనవరి 13 కోసం మీఅందరితో పాటు నేను ఎదురుచూస్తున్నాను’’ అన్నారు. ఈ వేడుకలో బేబీసారా, డీవోపీ మణికందన్, ఎడిటర్ గ్యారీ బిహెచ్ తోపాటు చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.